Odisha : సామాన్యుడి నుంచి అధికారుల వరకు… ఐదు రోజుల్లో లక్షమందిని కలిసిన ఒడిశా కొత్త సీఎం
- 25ఏళ్ల తర్వాత ఒడిశాలో కొత్త ప్రభుత్వం
- విజయఢంకా మోగించిన బీజేపీ
- కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని గత ఐదు రోజుల్లో దాదాపు లక్ష మంది ప్రజలు కలిశారు. వీరిలో రాష్ట్రంలోని నలుమూలల నుండి పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఉన్నారు. ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. మాఝీ సీఎం కాగానే అభినందనల వెల్లువ వచ్చింది. ఆదివారం సామాన్యులు, సంస్థల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరూ సీఎం మాఝీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెల్లడించింది. ఈ సమావేశంలో సీఎం మాఝీ మీడియాతో మాట్లాడుతూ.. ‘జగన్నాథుడి ఆశీస్సులు, ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో వారికి సేవ చేయడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటుపడే బాధ్యతను నాకు అప్పగించారు. ఆయనను కలిసే సమయం మధ్యాహ్నం 3 గంటలకు నిర్ణయించారు. నన్ను కలవడానికి ప్రజలు ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిల్చున్నారని, అయితే నేను మధ్యాహ్నం 3 గంటలకే వారిని కలిసేందుకు సమయం కేటాయించాను‘ అని చెప్పారు.
Read Also:Pawan Kalyan : హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టనున్న పవర్ స్టార్.. ఎప్పుడంటే..?
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ముఖ్యమంత్రి మాఝీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాలానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైందన్నారు. దీంతో ఇక్కడి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని సీఎం మాఝీ అన్నారు. ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ప్రజల సహకారంతో మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందని, దీని ప్రభావం వచ్చే 50 ఏళ్ల పాటు కొనసాగుతుందన్నారు. 25 ఏళ్ల తర్వాత ఒడిశాలో ప్రభుత్వం మారింది. ఇక్కడ బీజేపీకి తొలిసారి భారీ ఆధిక్యం లభించింది. గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ సీఎం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాల్లో బీజేపీకి 78, బీజేడీకి 51, కాంగ్రెస్కు 14, సీపీఎంకు 1, ఇతరులకు 3 సీట్లు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒకప్పుడు ఎన్డీయేలో భాగమైనప్పటికీ 2009లో ఎన్డీయే నుంచి విడిపోయారు.
Read Also:Donald Trump: ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని బహిష్కరిస్తా(వీడియో)
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!