నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అమ్మవారు తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తారు.. ఈ తొమ్మిది రోజుల్లో చేసే పూజలు, వ్రతాలతో దేవుడి అనుగ్రహం కలుగుతుందని, ప్రత్యేక హోమాలు కూడా చెయ్యడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. నవరాత్రులలో హోమం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ హోమం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇంకా మహాగణపతి హోమం చేయడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే ఆరోగ్యం, వ్యాపారంలో విజయం సాధించడం జరుగుతుంది..
దశమహావిద్యా హోమం.. చేయడం వల్ల ఆనందంతో కూడిన కుటుంబ జీవితం చేకూరుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. జీవితంలో విశ్వాసం, ఉత్సాహం కలుగుతుంది.
శ్రీవిద్యా హోమం..ఈ హోమాన్ని చేస్తే, విద్యలో ఉత్తమంగా పనిచేస్తుంది. `పురుష సూక్త హోమం’ చేస్తే, జీవితంలో విజయం, పిల్లల్లో ఉన్నతి, సంపద చేకూరుతాయి.
శ్రీసూక్త హోమం.. ఈ హోమం చేయడం వల్ల అనేక ఫలాలు అందుతాయి. శ్రీసూక్తానికి అధిపతి మహాలక్ష్మీదేవి. కావున, ఈ హోమాన్ని చేస్తే, సంపద చేరుతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
కాళీ హోమం.. సాధారణంగా ఈ హోమాన్ని న్యాయమైన శత్రువుల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది..
ఇకపోతే నవరాత్రుల్లో లలితా సహస్రనామ హోమం చేయించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లలితా త్రిశతి హోమం.. ఈ హోమం చేయడం వల్ల, ఆత్మ లాభం, జీవితంలో నమ్మకం, ఉత్సాహం కలుగుతాయి.
భువనేశ్వరి హోమం.. ఈ హోమం చెయ్యడం ఆరోగ్యం, కుటుంబంలో ఆనందం ఉంటాయి.. ఏదైనా సందర్భాన్ని బట్టి హోమం చెయ్యడం మంచిదని పండితులు చెబుతున్నారు..