NIA: ఉగ్రదాడి కేసులో దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ 22 చోట్ల దాడులు
- పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.
- కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) శనివారం రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు.
- 5 రాష్ట్రాల్లోని 22 చోట్ల దాడులు
NIA Rides On Jaish-e-Mohammad: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సానుబుతిపరులపై దర్యాప్తు భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) శనివారం 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీలో దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాలెగావ్ లోని హోమియోపతి క్లినిక్పై ఎన్ఐఏ బృందం దాడులు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, కుట్రకు సంబంధించిన ప్రధాన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా విస్తృత దాడులు ప్రారంభించింది. RC-13/24/NIA/DLI కేసు కింద ఈ చర్య తీసుకోబడింది. దింతో దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ నెట్వర్క్ లక్ష్యంగా చేసుకొని 5 రాష్ట్రాల్లోని 22 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
Manu Bhaker: మొదటిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్
Also Read
పాన్ ఇండియా స్థాయిలో జైష్ నెట్వర్క్పై ఎన్ఐఏ ఇంత సమగ్ర చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. ఉగ్రవాద సంస్థ నెట్వర్క్ జమ్మూ కాశ్మీర్ వెలుపల కూడా విస్తరిస్తోంది. ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలోని ముస్తఫాబాద్లో ఎన్ఐఏ అర్థరాత్రి దాడి చేసింది. ఈ ఆపరేషన్లో ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. సోదాల్లో అనుమానాస్పద వస్తువులు లభించినట్లు సమాచారం అందుతోంది. అధికారులు కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఇద్దరినీ మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి రాత్రంతా కొనసాగి తెల్లవారుజామున ముగిసింది.
Gorre Puranam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గొర్రె పురాణం’
#WATCH | Maharashtra: NIA raids a homeopathy clinic in Malegaon, in a terror conspiracy case.
National Investigation Agency is carrying out searches at 22 locations in five states, including Maharashtra. pic.twitter.com/v0cU7sQLWZ
— ANI (@ANI) October 5, 2024
తాజావార్తలు
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!