Hassan Nasrallah: నస్రల్లా ముందే కాల్పుల విరమణకు అంగీకరించాడు.. లెబనాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు
- మరణానికి ముందు నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించాడు
- లెబనీస్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా తన మరణానికి ముందు ఇజ్రాయెల్తో కాల్పుల విరమణకు అంగీకరించాడని లెబనాన్ మంత్రి తెలిపారు. లెబనీస్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్ మాట్లాడుతూ.. వైమానిక దాడిలో మరణించడానికి కొద్ది రోజుల ముందు నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని వెల్లడించారు. కాల్పుల విరమణ నిర్ణయాన్ని అమెరికా, ఫ్రాన్స్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు తెలిపారు.
ఓ ఇంటర్వ్యూలో హబీబ్ మాట్లాడుతూ.. “హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా 21 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు. లెబనీస్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీ నస్రల్లాతో సమావేశమయ్యారు. దీనిలో నస్రల్లా యుద్ధాన్ని ఆపడానికి అంగీకరించాడు. దీని తరువాత, హిజ్బుల్లా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు బెర్రీ అమెరికన్, ఫ్రెంచ్ ప్రతినిధులకు తెలియజేశాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారని మాకు సమాచారం అందిందని, అయితే తర్వాత ఆయన మనసు మార్చుకుని లెబనాన్పై దాడి కొనసాగించారు.” అని లెబనీస్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా హబీబ్ పేర్కొన్నారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
వాస్తవానికి, సెప్టెంబర్ 27న ఈ దాడికి ముందు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ న్యూయార్క్లో కలుసుకున్నారు. ఆ తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి సెప్టెంబర్ 25న 21 రోజుల కాల్పుల విరమణ కోసం తమ ప్రణాళికను ముందుకు తెచ్చాయి. కానీ నెతన్యాహు ఈ ప్రణాళికను తిరస్కరించారు. ఆ తర్వాత నస్రల్లా లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులను చేసింది. హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకరంగా బాంబులను ప్రయోగించింది. ఈ ఘటనలోనే హిజ్బుల్ చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యారు.
లెబనాన్ను విడిచిపెట్టమని సలహా ఇచ్చిన ఖమేనీ
ఇజ్రాయెల్ దాడిలో మరణించిన కొద్ది రోజుల ముందు లెబనాన్ నుండి పారిపోవాలని నస్రల్లాను ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ బుధవారం నివేదించింది. పేజర్ దాడులలో హిజ్బుల్లా సభ్యులు మరణించిన తరువాత, ఇజ్రాయెల్ హిజ్బుల్లాలో కార్యకర్తలు ఉన్నారని, నస్రల్లాను చంపాలని యోచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలను ఉటంకిస్తూ, ఒక రాయబారితో ఇరాన్కు రావాలని ఖమేనీ కోరాడు. ఖమేనీ పంపిన మెసెంజర్ సీనియర్ ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్, బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరౌషన్ అని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. అనంతరం బంకర్లో నస్రల్లాతో పాటు ఆయన కూడా చంపబడ్డాడు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!