Parliament Special session: కీలక నిర్ణయం తీసుకోనున్న మోడీ సర్కార్? రాజకీయాలను షేక్ చేయనున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Special session: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసి మూడు వారాలే అయింది. తిరిగి పార్లమెంట్ సెషన్ డిసెంబరులో ఉండాలి. అయితే సంవత్సరాంతంలో జరగాల్సిన శీతాకాలు కాకుండా మోడీ సర్కార్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇవి ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు నిరవధికంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెషన్ దేని కోసం అన్నది ఆయన చెప్పలేదు. ఎజెండాను ప్రకటించలేదు. అయితే ఈ సెషన్ లో మోదీ సర్కార్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కోసం ఈ ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: MK Stalin: ‘మన్ కీ బాత్’ కు పోటీగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
షెడ్యూలు ప్రకారం డిసెంబరులో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే అక్కడ బీజేపీకి అంత అనుకూల వాతావరణం లేదు. ప్రస్తుతానికి అక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి అనుకూల ఫలితాలు రాకపోతే వాటి ప్రభావం తరువాత వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడే అవకాశం ఉందని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియా కూటమి నేతలు ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దేశంలో కూడా ఇండియా కూటమికి మద్దతు పెరుగుతూ ఉండటంతో ఈ ప్రత్యేక సెషన్ ద్వారా పలు కీలక నిర్ణయాలను ప్రధాని మోడీ తీసుకోనున్నట్లు అర్థం అవుతుంది.
బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలు, ఉన్నతి, చంద్రయాన్ సక్సెస్, పెట్టుబడుల ఇలా పలు విషయాలను పార్లమెంట్ లో వివరించే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. దాంతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలను నిర్వహించునున్న ప్రకటనను కూడా మోడీ సర్కారు చేసే అవకాశం ఉందని, దాని కోసమే ఈ సెషన్ అని పలువురు భావిస్తున్నారు. ఈ సెషన్ లోనే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రకటించి దాని ద్వారా కూడా లాభం పొందాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరికొన్ని రోజుల్లో జరగనున్న సమావేశాలలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!