MPDO Missing Mystery: వీడని ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. ఇంతకీ ఏం జరిగినట్టు..?
- నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మిస్సింగ్ కేసులో మిస్టరీ..
- ఆత్మహత్య చేసుకున్నారా? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోయారా? అనే అనుమానాలు..!
- ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారుల విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MPDO Missing Mystery: నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మిస్సింగ్ కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోయారా? అనే విషయంలో అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్.. 4 బోట్లలో ఏలూరు కాల్వను జల్లెడ పట్టనుంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్.. గన్నవరం సమీపంలో ఉన్న కీసరపల్లి నుంచి ఇవాళ గాలింపు చర్యలు మొదలు పెట్టనున్నారు.. మొత్తం 30 మంది సిబ్బందితో ఏలూరు కాల్వలో పూర్తిస్థాయిలో గాలింపు చర్యలకు దిగారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ కేసును సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేయటంతో.. విచారణ వేగవంతం చేశారు పోలీసులు.
Read Also: NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
Also Read
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
మరోవైపు.. MPDO రమణా రావు మిస్సింగ్ వ్యవహారంలో విచారణ చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు. ఫెర్రీ వేలం బకాయి 54లక్షల వసూలు విషయంలో ఒత్తిడికి లోనైనట్టు లేఖలో పేర్కొన్న వెంకట రమణారావు.. ఈ నెల 15వ తేదీ రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకెక్కడైనా ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై విచారణకు ఆదేశించారు. నీతో రంగంలో దిగిన అధికారులు.. 2023- 24 ఫెర్రీ వేలం , చెల్లింపుల వివరాలు సేకరిస్తున్నారు. బకాయి దారుడు నుంచి 54 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు జేఏసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోనున్నారు. ఇక, ఏలూరు కాల్వలో ఇప్పటి వరకు ఎంపీడీవో ఆచూకీ లభించలేదు.. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏలూరు కాల్వలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేట్టాయి.. అయినా ఫలితం దక్కలేదు.. ఈ రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: MATKA: రామోజీ ఫిల్మ్ సిటీలో ముగించిన ‘మట్కా’..నెక్స్ట్ ఎక్కడంటే..?
కాగా, నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎంపీడీవో అదృశ్యం విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం విదితమే.. ఎంపీడీవో కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆరా తీసిన ఆయన.. నరసాపురం ఫెర్రి బకాయిలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని.. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని.. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్నవారి వివరాలను తక్షణమే అందించాలని.. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!