Vyooham: ‘వ్యూహం’ సినిమాకు ఆర్జీవి కి షాక్ ఇచ్చిన సివిల్ కోర్ట్..రిలీజ్ కష్టమే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. రీసెంట్ గా ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ వచ్చినట్లు ఆర్జీవి తెలిపారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎవరూ ఆపలేరు.. ఈ సినిమా డిసెంబర్ 29 న విడుదల కాబోతుందని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని అందులో ఆయన కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మరియు దర్శకుడు రామ్గోపాల్ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు.వ్యూహం సినిమా విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న ఆ పిటిషన్ విచారణకు రానుంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనకు నచ్చరని రామ్గోపాల్ వర్మ అన్నారు. తన ఇష్టాయిష్టాలతో సినిమాలోని పాత్రలను నిర్ణయించుకున్నారు. చంద్రబాబును సినిమాలో తప్పుగా చూపించారు. ట్రైలర్లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉంది. 70ఏళ్ల జీవితంలో చంద్రబాబు నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన్ను అపఖ్యాతి పాలుజేసే రాజకీయ శత్రువైన జగన్కు లబ్ధిపొందేలా చూస్తున్నారు. వాక్స్వాతంత్య్రం పేరుతో దర్శక, నిర్మాతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం కూడా దెబ్బతింటోంది. వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి చిత్రాల వల్ల దర్శక నిర్మాతలకు ఎలాంటి లాభాలు రాలేదు. అయినా మరోసారి అలాంటి సినిమానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు నష్టాలు వస్తాయని తెలిసినా కేవలం జగన్కు లాభం కలగడం కోసం ఈ సినిమాను తీశారు. జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ సినిమాను తీయించారు” అని నారా లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటీషన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఓటీటీ, ఆన్లైన్ వేదికలలో విడుదల చేయవద్దని ఆదేశిస్తూ, ఆర్జీవి,నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్ కు నోటీసులు ఇచ్చింది.తదుపరి విచారణ ఈ నెల 27 కు వాయిదా వేసింది.
Also Read
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!