Chandrababu Security: జైలులో మావోయిస్టులు ఉన్నారు.. ఏస్పీకి లేఖ వచ్చింది.. చంద్రబాబుకు భద్రతలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Security: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ రోజు తన తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రహ్మణితో కలిసి జైలులో ఉన్న చంద్రబాబును ములాకత్లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఇప్పటికీ చంద్రబాబు భద్రత పై అనుమానాలు ఉన్నాయి.. ఎస్పీకి మావోయిస్టులు లేఖరాసారు.. ఇదే జైలులో మావోలు వుండటంతో చంద్రబాబు భత్రతపై అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.. చంద్రబాబు జైలులోకి వెళ్లిన రోజున లోపల విజువల్స్ టీవీల్లో వచ్చాయి.. అవి చట్టవిరుద్ధం.. అవి ప్రసారం చేసిన ఛానళ్లపై న్యాయపోరాటం చేస్తాం అన్నారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.. ప్రజల తరఫున పోరాడినందుకు చంద్రబాబునాయుడుని కక్ష కట్టి వ్యవస్థల్ని మెనేజ్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు.
గత 28 రోజులుగా జ్యూడిషియల్ రిమాండ్ చంద్రబాబు ఉన్నారు. ఇసుక, మద్యం, మట్టి, మాఫియాలపై నిలదీసినందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు లోకేష్.. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును 28 రోజులు రిమాండులో ఉంచారు.. బ్రాహ్మణి, భువనేశ్వరి హెరిటేజ్ లో కష్టపడి సంపాదిస్తుంటే మేం పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాం అన్నారు. ప్రతి ఎకరం కష్టపడి కొనుక్కున్నదే. చంద్రబాబు నాయుడు ఏనాడూ అవినీతి, తప్పులు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులు అడుగడుగునా మా తెలుగుదేశం నాయకులను అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా .. లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ప్రజల తరఫున పోరాడమని మా చంద్రబాబు చెప్పారు. శాంతియుతంగా పోరాటాలు చేయాలని సూచించారని పేర్కొన్నారు.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ఇక, మొదట్లో మూడు వేల కోట్లు అవినీతి అన్నారు. తర్వాత 300 కోట్లు.. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు.. రేపు 0 అంటారు అని దుయ్యబట్టారు లోకేష్.. మా కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీదకు తీసుకువచ్చింది ఈ పిచ్చి జగన్ అని మండిపడ్డ ఆయన.. ప్రతి మహానాడులోనూ మా పార్టీ విధులు ఖర్చులు తెలియజేస్తుంటాం. వైసీపీ ఎప్పుడైనా ఆ పార్టీ లెక్కలు చెప్పిందా..? అని నిలదీశారు. తెలుగుదేశం – జనసేన కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తాం. వైసీపీ నాయకులు కార్యకర్తలు.. పోలీసులు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్ పై దాడి చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నాం.. జైల్లో ఇప్పటికి కూడా చంద్రబాబుకు సరైన భద్రత లేదని మా అభిప్రాయంగా చెప్పారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందని నేను భావించడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.
తాజావార్తలు
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!