Nara Lokesh: రామోజీరావు పార్థివదేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు. ఫిల్మ్సిటీకి చేరుకుని రామోజీ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులను లోకేష్ దంపతులు పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని నారా లోకేష్ అన్నారు. మీడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.
Read Also: Chandrababu: రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్సిటీకి తరలించగా.. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.