నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సెకండ్ పార్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది. అది ఏంటంటే, ప్రస్తుతానికి బాలకృష్ణ గోపీచంద్తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మించబోతున్న ఈ సినిమా దాదాపుగా పట్టాలెక్కడం ఖాయమే. అయితే ఈ గ్యాప్లో దర్శకుడు క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో బాలకృష్ణ క్రిష్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
READ MORE: Florida: విమానంలో పిల్లల ముందే జంట రోమాన్స్.. ఎంత చెప్పినా ఆపకపోవడంతో..
నందమూరి బాలకృష్ణ కెరీర్లో అద్భుతమైన హిట్గా నిలిచిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్గా ఆదిత్య 999 అనే సినిమా కథ క్రిష్ బాలకృష్ణకి చెప్పినట్లుగా తెలుస్తోంది. సినిమా కథ బాగా నచ్చడంతో కాదనకుండా ఆయన వెంటనే సినిమా చేద్దామని చెప్పారని అంటున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు క్రిష్ సినిమాని కూడా ఒకే సమయంలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్లో మరో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేసి రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయానికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.