NCRTC Pre-Wedding Rules: రైళ్లలో ప్రీ-వెడ్డింగ్ షూట్స్కు ఓకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCRTC Pre-Wedding Rules: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఒక కీలక ముందు అడుగు వేసింది. ఇప్పుడు ఢిల్లీ-మీరట్ కారిడార్లోని నమో భారత్ రైళ్లు, వాటి స్టేషన్లలో పుట్టినరోజు పార్టీలు, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్లు, చిన్న సమావేశాలు వంటి వ్యక్తిగత కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఢిల్లీ-మీరట్ కారిడార్లో ప్రజలు రైలులో ప్రీ-వెడ్డింగ్ షూట్లను నిర్వహించగలరు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: ESI Hospital : సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
NCRTC మాట్లాడుతూ.. ఈ కొత్త విధానం ప్రకారం వ్యక్తులు, ఈవెంట్ నిర్వాహకులు, ఫోటోగ్రఫీ లేదా మీడియా కంపెనీలు నమో భారత్ రైలు కోచ్లను బుక్ చేసుకోవచ్చు. అవి నడుస్తున్నా లేదా స్టేషనరీ అయినా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దుహై డిపోలో ఒక మాక్-అప్ కోచ్ కూడా ఉంటుందని, దీనిని షూటింగ్ కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
ధర – ఫీచర్లు ఇవే..
పలు నివేదికల ప్రకారం.. నమో భారత్ రైలును గంటకు రూ.5 వేలు చెల్లించి ఇటువంటి కార్యక్రమాల కోసం బుక్ చేసుకోవచ్చు. అదనంగా అలంకరణలను ఏర్పాటు చేయడానికి 30 నిమిషాలు, వాటిని తొలగించడానికి 30 నిమిషాలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. NCRTC ప్రకారం.. ఇది సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఎందుకంటే నమో భారత్ రైళ్లు ఆధునిక డిజైన్లను కలిగి ఉంటాయి, ఇవి ఫోటోషూట్లు, చిన్న ఈవెంట్లకు అనువైనవి. అలాగే బుక్ చేసుకున్న వారు వీటిని ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా తమకు నచ్చిన అలంకరణలను కూడా చేసుకోవచ్చని తెలిపింది.
ఏ టైంలో బుకింగ్ చేసుకోవాలంటే..
ఈ కార్యక్రమాల కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుందని NCRTC పేర్కొంది. సాధారణ రైలు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సంస్థ పేర్కొంది. బుక్ చేసుకున్న వారు భద్రత, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి, మొత్తం ఈవెంట్ను NCRTC సిబ్బంది, భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపింది.
ఈ సౌకర్యం ప్రధానంగా ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ సౌత్ వంటి ప్రధాన స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. నమో భారత్ రైళ్లు, స్టేషన్లలో ఫిల్మ్ షూట్లు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు, ఇతర వీడియో ప్రాజెక్టుల కోసం కొత్త ఛార్జీల విధానాన్ని ఏర్పాటు చేసినట్లు NCRTC వెల్లడించింది.
READ ALSO: New Labour Codes: అమలులోకి కొత్త లేబర్ కోడ్లు.. కార్మికులు తప్పని సరిగా తెలుసుకోవాల్సినవి ఇవే
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!