Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీ ఫేజ్ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న చైతూ తాజాగా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
Also Read : TheyCallHimOG Part : పవర్ స్టార్ OG సీక్వెల్ ఓజస్ గంభీర – రాంపేజ్ బిగిన్స్
Also Read
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
గతంలో ‘మనం’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో అలరించిన తండ్రీకొడుకుల కాంబినేషన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన ఈ దర్శకుడు మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే, నాగచైతన్య తన కెరీర్లో మైలురాయి లాంటి 25వ సినిమా (NC25) కోసం ‘బెదురులంక 2012’ ఫేమ్ దర్శకుడు క్లాక్స్తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్యూర్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. చైతూ ఇమేజ్కు తగ్గట్టుగా క్లాక్స్ ఒక వైవిధ్యమైన ప్రేమకథను సిద్ధం చేశారట. ప్రస్తుతం చైతన్య తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతోంది. ఇటు ‘వృషకర్మ’తో పాటు అటు కళ్యాణ్ కృష్ణ మరియు క్లాక్స్ సినిమాలను లైన్లో పెట్టి చైతూ తన లైనప్ను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న చైతన్యకు ఈ కొత్త ప్రాజెక్టులు మరిన్ని విజయాలను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!