Nadendla Manohar: ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఉదయం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల. మనోహర్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని సిటీ స్కాన్ విభాగాన్ని చూసి ఎందుకు పనిచెయ్యటం లేదని వైద్య సిబ్బందిని మనోహర్ ప్రశ్నించారు. ఎక్కువ శాతం రోగులను ఇక్కడ ట్రీట్మెంట్ చెయ్యకుండా గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా సేవలు మెరుగుపరచాలని వైద్యులకు పలు సూచనలు చేశారు. రోగుల దగ్గరకు వెళ్లి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా వైధ్యం అందుతుందా అని ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఏమర్జన్సీ నుంచి ఐసీయూ విభాగంవరకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ ఎందుకు తక్కువ ఉన్నాయి మాకు చెబితే మేము బ్లడ్ డోనేషన్ క్యాంపులు పెట్టి మీకు బ్లడ్ పంపుతాము అని వైద్యులకు మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ మిషన్లు పనిచెయ్యక బ్లడ్ కొరతలు ఉండి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియా తో మాట్లాడుతూ చాలా రోజుల తరువాత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు సందర్శించటం జరిగిందన్నారు.
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Read Also: Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం
ఆసుపత్రిలో వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు అన్నారు. గతంలో నేను నిధులు తీసుకువచ్చి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాము ఇప్పటి ప్రభుత్వాలు వాటికి నిధులు ఇచ్చి మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చెయ్యాలి. ప్రభుత్వం పేదలకు అందించే వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి 12 వందల మంది రోగులు వచ్చేవారు కానీ ఇప్పుడు 5వందల మంది మాత్రమే రోగులు వస్తున్నారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. ఆసుపత్రిలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉండటాన్ని గమనించాను. ఇతర ప్రాంతాలనుంచి వస్తున్నారు అక్కడే ఇంకా మెరుగైన సేవలు ఎందుకు చెయ్యటం లేదు బ్లడ్ కావాలి అంటే జనసేన బ్లడ్ క్యాంప్ లు పెట్టి బ్లడ్ అందిస్తామన్నారు.
ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వైద్య సిబ్బంది పై తీవ్ర వత్తిడి ఉంటుంది. ప్రభుత్వం పేదల వైద్య సేవలపై పారదర్శకంగా వ్యవహరించాలి. సిటీస్కాన్ సేవలు నిలుపుదల చేశారు ప్రభుత్వ పెద్దలు నిధులు ఇచ్చి సిటీ స్కాన్ సేవలో పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. కోవిడ్ సమయంలో వైద్యులు,సిబ్బంది మెరుగైన సేవలు అందించారని కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో తెనాలి వైద్యశాలకు జనసేన తరపున తనవంతు కృషి అందిస్తానని తెలిపారు.
Read Also: Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!