Nadendla Manohar: ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఉదయం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల. మనోహర్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని సిటీ స్కాన్ విభాగాన్ని చూసి ఎందుకు పనిచెయ్యటం లేదని వైద్య సిబ్బందిని మనోహర్ ప్రశ్నించారు. ఎక్కువ శాతం రోగులను ఇక్కడ ట్రీట్మెంట్ చెయ్యకుండా గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా సేవలు మెరుగుపరచాలని వైద్యులకు పలు సూచనలు చేశారు. రోగుల దగ్గరకు వెళ్లి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా వైధ్యం అందుతుందా అని ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఏమర్జన్సీ నుంచి ఐసీయూ విభాగంవరకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ ఎందుకు తక్కువ ఉన్నాయి మాకు చెబితే మేము బ్లడ్ డోనేషన్ క్యాంపులు పెట్టి మీకు బ్లడ్ పంపుతాము అని వైద్యులకు మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ మిషన్లు పనిచెయ్యక బ్లడ్ కొరతలు ఉండి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియా తో మాట్లాడుతూ చాలా రోజుల తరువాత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు సందర్శించటం జరిగిందన్నారు.
Also Read
Read Also: Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం
ఆసుపత్రిలో వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు అన్నారు. గతంలో నేను నిధులు తీసుకువచ్చి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాము ఇప్పటి ప్రభుత్వాలు వాటికి నిధులు ఇచ్చి మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చెయ్యాలి. ప్రభుత్వం పేదలకు అందించే వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి 12 వందల మంది రోగులు వచ్చేవారు కానీ ఇప్పుడు 5వందల మంది మాత్రమే రోగులు వస్తున్నారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. ఆసుపత్రిలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉండటాన్ని గమనించాను. ఇతర ప్రాంతాలనుంచి వస్తున్నారు అక్కడే ఇంకా మెరుగైన సేవలు ఎందుకు చెయ్యటం లేదు బ్లడ్ కావాలి అంటే జనసేన బ్లడ్ క్యాంప్ లు పెట్టి బ్లడ్ అందిస్తామన్నారు.
ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వైద్య సిబ్బంది పై తీవ్ర వత్తిడి ఉంటుంది. ప్రభుత్వం పేదల వైద్య సేవలపై పారదర్శకంగా వ్యవహరించాలి. సిటీస్కాన్ సేవలు నిలుపుదల చేశారు ప్రభుత్వ పెద్దలు నిధులు ఇచ్చి సిటీ స్కాన్ సేవలో పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. కోవిడ్ సమయంలో వైద్యులు,సిబ్బంది మెరుగైన సేవలు అందించారని కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో తెనాలి వైద్యశాలకు జనసేన తరపున తనవంతు కృషి అందిస్తానని తెలిపారు.
Read Also: Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!