Nadendla Manohar: ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఉదయం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల. మనోహర్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని సిటీ స్కాన్ విభాగాన్ని చూసి ఎందుకు పనిచెయ్యటం లేదని వైద్య సిబ్బందిని మనోహర్ ప్రశ్నించారు. ఎక్కువ శాతం రోగులను ఇక్కడ ట్రీట్మెంట్ చెయ్యకుండా గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా సేవలు మెరుగుపరచాలని వైద్యులకు పలు సూచనలు చేశారు. రోగుల దగ్గరకు వెళ్లి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా వైధ్యం అందుతుందా అని ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఏమర్జన్సీ నుంచి ఐసీయూ విభాగంవరకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ ఎందుకు తక్కువ ఉన్నాయి మాకు చెబితే మేము బ్లడ్ డోనేషన్ క్యాంపులు పెట్టి మీకు బ్లడ్ పంపుతాము అని వైద్యులకు మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ మిషన్లు పనిచెయ్యక బ్లడ్ కొరతలు ఉండి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియా తో మాట్లాడుతూ చాలా రోజుల తరువాత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు సందర్శించటం జరిగిందన్నారు.
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
Read Also: Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం
ఆసుపత్రిలో వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు అన్నారు. గతంలో నేను నిధులు తీసుకువచ్చి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాము ఇప్పటి ప్రభుత్వాలు వాటికి నిధులు ఇచ్చి మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చెయ్యాలి. ప్రభుత్వం పేదలకు అందించే వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి 12 వందల మంది రోగులు వచ్చేవారు కానీ ఇప్పుడు 5వందల మంది మాత్రమే రోగులు వస్తున్నారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. ఆసుపత్రిలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉండటాన్ని గమనించాను. ఇతర ప్రాంతాలనుంచి వస్తున్నారు అక్కడే ఇంకా మెరుగైన సేవలు ఎందుకు చెయ్యటం లేదు బ్లడ్ కావాలి అంటే జనసేన బ్లడ్ క్యాంప్ లు పెట్టి బ్లడ్ అందిస్తామన్నారు.
ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వైద్య సిబ్బంది పై తీవ్ర వత్తిడి ఉంటుంది. ప్రభుత్వం పేదల వైద్య సేవలపై పారదర్శకంగా వ్యవహరించాలి. సిటీస్కాన్ సేవలు నిలుపుదల చేశారు ప్రభుత్వ పెద్దలు నిధులు ఇచ్చి సిటీ స్కాన్ సేవలో పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. కోవిడ్ సమయంలో వైద్యులు,సిబ్బంది మెరుగైన సేవలు అందించారని కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో తెనాలి వైద్యశాలకు జనసేన తరపున తనవంతు కృషి అందిస్తానని తెలిపారు.
Read Also: Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!