Nadendla Manohar: విద్యాశాఖలో స్కాంలు జరిగాయి.. త్వరలో బయటపెడతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదలకు నాణ్యమైన విద్య పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారే ఒప్పందాలు జగన్ ప్రభుత్వం చేసుకుంటోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. టీచర్లకు జీతాలివ్వడంలో విఫలమవుతోన్న ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.. ప్రాథమిక అంశాలను పక్కన పెట్టి.. విద్యా రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది.. టోఫెల్ శిక్షణ కోసం 54 పేజీల ఒప్పందం.. ఆ ఒప్పందాన్ని మంత్రి బొత్స చదివాలి అని ఆయన అన్నారు. ఇక ఐబీ సంస్థతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.. భారత దేశ చట్టాలు ఐబీ సంస్థకు వర్తించవట.. ఏమైనా తేడా వస్తే జెనీవా కోర్టులో తేల్చుకోవాలంట.. టీచర్ల ట్రైనింగ్ నిమిత్తం రూ. 1200 కోట్ల నుంచి రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారని నాదెండ్ల మనోహార్ అన్నారు.
Read Also: PM Modi: భారతీయుడు చంద్రునిపై దిగే రోజు ఎంతో దూరంలో లేదు..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
న్యాయశాఖ తిరస్కరించిన అంశాలను.. క్లాజులను ఒప్పందంలో పెట్టి మరీ కెబినెట్ ఆమోదించాల్సిన అవసరమేంటీ?.. అని నాదెండ్ల మనోహర్ అడిగారు. విద్యార్థుల సంఖ్య విషయంలో.. అమ్మఒడి లబ్దిదారుల సంఖ్య విషయంలో తేడాలున్నాయి.. సుమారు 5.71 లక్షల మంది విద్యార్థుల పేరుతో అమ్మ ఒడి నిధులు, విద్యా కానుక నిధులు పక్కదారి పట్టాయి.. సుమారు రూ. 743 కోట్ల మేర అమ్మఒడి నిధులు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు.
Read Also: El Nino: 2024 మధ్య వరకు ఎల్ నినో.. వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు ముప్పు..
అమ్మఒడిలో స్కాం జరిగింది.. ఇవాళ మంత్రి బొత్స పదే పదే ఒప్పందాలన్నీ కెబినెట్ నిర్ణయం మేరకు జరిగాయని ఎందుకు చెప్పుకొచ్చారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పేద విద్యార్థుల పేరుతో దోపిడీ జరుగుతోంది.. ఐబీ కరిక్యులమ్ తీసుకురావాలని ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తున్నారు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ఒప్పందాల వెనుకున్న మతలబేంటీ? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రూ. 100 కోట్ల దాటిన ప్రతి కార్యక్రమానికి జుడిషియరీ ప్రీవ్యూ ముందు పెడతామన్నారు.. ఇప్పుడెందుకు పెట్టలేదు.. విద్యాశాఖలో మరిన్ని స్కాంలు జరిగాయి.. అవి త్వరలో బయటపెడతాం అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!