Muthireddy Yadagiri Reddy : రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలవడం ఖాయం.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. 4 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో పెట్టారు. అయితే.. అంతేకాకుండా.. ప్రకటించిన 115 స్థానాల్లో ఏడుగురు సిట్టింగ్లను మార్చుతూ ప్రకటన చేశారు. అయితే.. పెండింగ్లో ఉంచిన 4 స్థానాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జనగాం ఒకటి. అయితే.. ఈసారి ముత్తిరెడ్డికి కాకుండా జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియా ముఖంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ సారి కూడా తనకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ను కోరారు.
అంతేకాకుండా.. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ లేకుండా.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేశానని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కట్టడి చేశారని, నియోజకవర్గంలో ఎవరు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఎవరిని తప్పు పట్టదు, డిస్టబెన్స్ చేసిన వారిని మాత్రమే తప్పుపడుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరు బెంగ పెట్టుకోకూడదు, పార్టీ అందరిని ఆదరిస్తుంది, అందరం కలిసి పని చేద్దామని ఆయన అన్నారు.
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
రాబోయే ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మూడోసారి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్న మరొకసారి ఇబ్బంది పెట్టొద్దని అని ఆయన అన్నారు. జనగామ జిల్లా ప్రజల కోరికలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయన్న ముత్తిరెడ్డి.. జిల్లా ఆకృతి రూపుదిద్దుకుంటుందన్నారు. జిల్లా కోర్టుకు 10 ఎకరాలు కేటాయించామని, జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 15 వ తేదీన సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. అదేరోజున పెద్ద ఎత్తున జిల్లా నుండి ప్రజలు తరలివచ్చి కార్యక్రమం దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏవిధంగా వచ్చిన సీఎం కేసీఆర్ దేశానికి సారథ్యం వహిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!