Murder Attempt: దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు.. చివరికి.?
- ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఘటన.
- దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు..
- పరిస్థితి ఇంకా విషమంగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Attempt: ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఓ బిచ్చగాడు రోడ్డుపై వెళ్తున్న వారిని బిక్షాటన చేసేవాడు. అదే సమయంలో తనకు దానం చేయని వారిపై దుర్భాషలాడేవాడు. ఇకపోతే తాజాగా నాయి బస్తీ-24లో నివాసముంటున్న ఓ వ్యక్తి కూడా అటుగా వెళ్తున్నాడు. అయితే యాచకుడు అతనిని దానం చేయాలని వేడుకున్నాడు. కానీ, సదరు వ్యక్తి దానం చేయలేదు. దీనిపై యాచకుడు ఆ వ్యక్తిని దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి దానికి నిరసన తెలపడంతో యాచకుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Gun Fire: ఢిల్లీలో తుపాకీ కాల్పులతో వీరంగం సృష్టించిన దుండగులు.. (వీడియో)
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో కొంతమంది ముందుగా పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు దాడి చేసిన యాచకుడిని పట్టుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు యాచకుడిని పోలీసులకు అప్పగించారు. ఇక క్షతగాత్రుడిని మాత్రం చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే, వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
Paris Paralympic Games 2024: భారత్ ఖాతాలో 29 పతకాలు.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందంటే..?
ఈ కేసులో కత్తితో పొడిచిన యాచకుడు వికలాంగుడని పోలీసులు తెలిపారు. అతను కిరాత్ పూర్ స్థానిక నివాసి. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి కూరగాయలు కోసే కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కత్తితో నయీమ్ పై దాడి చేశాడు. నయీం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. యాచకుడి నేర చరిత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!