Murder Attempt: దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు.. చివరికి.?
- ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఘటన.
- దానం చేయలేదని వ్యక్తిని కత్తితో పొడిచిన యాచకుడు..
- పరిస్థితి ఇంకా విషమంగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Attempt: ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఓ బిచ్చగాడు రోడ్డుపై వెళ్తున్న వారిని బిక్షాటన చేసేవాడు. అదే సమయంలో తనకు దానం చేయని వారిపై దుర్భాషలాడేవాడు. ఇకపోతే తాజాగా నాయి బస్తీ-24లో నివాసముంటున్న ఓ వ్యక్తి కూడా అటుగా వెళ్తున్నాడు. అయితే యాచకుడు అతనిని దానం చేయాలని వేడుకున్నాడు. కానీ, సదరు వ్యక్తి దానం చేయలేదు. దీనిపై యాచకుడు ఆ వ్యక్తిని దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి దానికి నిరసన తెలపడంతో యాచకుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Gun Fire: ఢిల్లీలో తుపాకీ కాల్పులతో వీరంగం సృష్టించిన దుండగులు.. (వీడియో)
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో కొంతమంది ముందుగా పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు దాడి చేసిన యాచకుడిని పట్టుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు యాచకుడిని పోలీసులకు అప్పగించారు. ఇక క్షతగాత్రుడిని మాత్రం చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే, వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం.
Paris Paralympic Games 2024: భారత్ ఖాతాలో 29 పతకాలు.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందంటే..?
ఈ కేసులో కత్తితో పొడిచిన యాచకుడు వికలాంగుడని పోలీసులు తెలిపారు. అతను కిరాత్ పూర్ స్థానిక నివాసి. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి కూరగాయలు కోసే కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కత్తితో నయీమ్ పై దాడి చేశాడు. నయీం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. యాచకుడి నేర చరిత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!