Mumbai Indians: ఎస్ఆర్హెచ్ దెబ్బకి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Playoffs Qualification Scenario: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి. లక్నోను హైదరాబాద్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం దాదాపు ముగిసినట్లైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఓడించింది.
Read Also: VD12 :విజయ్ దేవరకొండ బర్త్డే..స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
దీంతో క్యాష్ రిచ్ లీగ్ 17వ ఎడిషన్లో ఏడో విజయం నమోదు చేసిన హైదరాబాద్ జట్టు.. మొత్తంగా 14 పాయింట్లు సాధించి.. నెట్ రన్రేటు(0.406)ని మెరుగుపరచుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. అలాగే, మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్ (రన్రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్రేటు 0.476) 11 మ్యాచ్లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (రన్రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్ (రన్రేటు -0.769) వచ్చే వారం పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించినా 14 పాయింట్లతో పైకి వెళ్లిపోతుంది.
Read Also: MayaOne : భారీ యాక్షన్ సన్నివేశాలతో వణుకుపుట్టిస్తున్న ‘మాయావన్ ‘ టీజర్…
అయితే, మరోవైపు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (11 మ్యాచ్లు- 8 పాయింట్స్, పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్లు- 8 పాయింట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్లలో కేవలం 4 గెలిచి 8 పాయింట్లతో ఉంది. ఇక, మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లే వస్తాయి.. కాబట్టి టాప్-4లోకి ముంబై ఇండియన్స్ టీమ్ అడుగుపెట్టేందుకు అవకాశం లేదు. అలాగే, చివరి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు ఇంకో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లైంది.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!