IPL 2025: ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ విడుదల.. హార్దిక్ భావోద్వేగ సందేశం
- ముంబై ఇండియన్స్ 2025 జెర్సీ విడుదల
- హార్దిక్ పాండ్యా భావోద్వేగ సందేశం
- 2025లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతాం
- ముంబై ఇండియన్స్ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా.. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు సభ్యులకు ప్రత్యేకమైన భావోద్వేగ సందేశం ఇచ్చాడు. పాండ్యా, ఇతర ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో కలిసి ఫ్రాంచైజీ గర్వించదగ్గ వారసత్వాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. “2025లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతాం. ముంబై ఇండియన్స్ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చింది. నీలం, బంగారు రంగులతో మేము ఈ జట్టుకు గర్వంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు, ఇది మీకు ఇచ్చిన వాగ్దానం. మేము ఎప్పటికప్పుడు మీకోసం అద్భుతమైన ప్రదర్శనను అందిస్తాం. వాంఖడేలో కలుద్దాం!” అని హార్ధిక్ ఓ సందేశం ఇచ్చాడు.
Read Also: Union Bank : బ్యాంక్ జాబ్ కావాలా?.. 2691 పోస్టులు రెడీ.. ఇక వద్దన్నా జాబ్
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కొత్త జెర్సీ డిజైన్: ముంబై ఇండియన్స్ జట్టు గుర్తుగా ఉన్న నీలం, బంగారు రంగులు ఈ కొత్త జెర్సీలో కనిపిస్తాయి. నీలం రంగు జట్టులోని నమ్మకం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తే.. బంగారు రంగు గర్వం, విజయం, శ్రేష్ఠత కోసం నిరంతర అన్వేషణను సూచిస్తుంది.
Read Also: Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..
IPL 2025 షెడ్యూల్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. మార్చి 23న ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. MI, CSK మధ్య పోటీ అంటే అభిమానులకు ఎంతో పండగ.. కానీ గత కొన్ని సీజన్లలో ముంబై ప్రారంభ మ్యాచ్లో గెలవడం లేదు. గత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జట్టు 14 మ్యాచ్లలో నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో జట్టు మంచి ప్రదర్శన చూపించి 6వ ట్రోఫీని గెలవాలని ఆశతో ఉంది.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..