సమ్మర్ లో స్పైసి ఫుడ్ ను తీసుకోవడం కన్నా కూడా తాజాగా పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
మల్బరీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, వాటిలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ఎండాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.. బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. వాటిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటిలో అతి తక్కువ కేలరీలు ఉంటాయి.. అందుకే వీటిని తినడం వల్ల ఎక్కువగా ఆకలి వెయ్యదు.. దాంతో బరువును కంట్రోల్ చేసుకోవచ్చు..
ఇనుము, కాల్షియం చాలా ముఖ్యమైనవి. ఈ రెండు పోషకాలు మల్బరీలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృడంగా ఉంటాయి.. గుండె, ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని కారణంగా గుండెపోటు, అథెరోస్క్లెరోసిస్, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. డయాబేటీస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.. క్యాన్సర్ నివారణలో సహాయ పడుతుంది.. అలాగే చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. మల్బరీలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు అవసరం. ఫైబర్స్ కడుపులోని ఆహారం ప్రేగుల గుండా వెళ్ళడానికి సహాయపడతాయి.. ఇంకా అనేక సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.