Mukhesh Ambani: ముకేశ్ అంబానీకి 4రోజుల్లో మూడు బెదిరింపు మెయిల్స్.. ఈ సారి రూ.400కోట్లు డిమాండ్
Mukhesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీకి వారంలో మూడోసారి మెయిల్లో హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి బెదిరింపులు రూ.400 కోట్లు ఇవ్వలన్న డిమాండ్ వచ్చింది. ఇంతకు ముందు శనివారం కూడా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి రూ.20 కోట్లు అడిగారని, మరుసటి రోజే రూ.200 కోట్లకు పెంచారన్నారు. ఈసారి మెయిల్లో బెదిరించిన వ్యక్తి రూ. 400 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు పోలీసులు నన్ను అరెస్టు చేయలేరు అని కూడా రాశారు. మునుపటి రెండు ఇమెయిల్లు వచ్చిన చిరునామా నుండి ఈ ఇమెయిల్ కూడా వచ్చింది.
IP అడ్రస్ బెల్జియం నుంచి
ముంబై పోలీసులు ఇప్పటికీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే రెండు పాత ఇమెయిల్ల IP చిరునామాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, ఇంటర్పోల్ ద్వారా ఈ ఇమెయిల్ వివరాలను ధృవీకరించడంలో బెల్జియన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీ (VPN) నుండి సహాయం కోరింది. ఈ మెయిల్లు shadabkhan@mailfence.com నుండి పంపబడ్డాయి. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ IP చిరునామా బెల్జియంకు చెందినది. అయితే బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి వేరే దేశంలో ఉన్నాడని, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బెల్జియం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Read Also:Chandrababu: ఆ తర్వాతే జైలు నుంచి బయటకు చంద్రబాబు..!
నన్ను కనిపెట్టండి చూద్దాం
గత రెండు మెయిల్స్ తర్వాత సోమవారం పంపిన మూడో ఇమెయిల్లో బెదిరింపు చేస్తున్న వ్యక్తి ఇలా రాశాడు, ‘ఇప్పుడు మా డిమాండ్ను రూ.400 కోట్లకు పెంచాం. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయలేరు’ అని మెయిల్లో రాసుకొచ్చాడు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలి మెయిల్లో రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. శనివారం రెండో మెయిల్లో రూ.200 కోట్లకు పెంచారు. మహారాష్ట్రలోని క్రైమ్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ సెల్ సంయుక్తంగా దీనిపై విచారణ జరుపుతున్నాయి. కేవలం బెదిరింపుల కోసమే ఈ మెయిల్ అడ్రస్ను రూపొందించినట్లు ఫస్ట్ లుక్లో కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు.
మొదట బాంబు బెదిరింపు
ముఖేష్ అంబానీ, అతడి కుటుంబానికి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరు 5న రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ఓ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆసుపత్రిని బాంబుతో పేల్చివేయాలనే చర్చ కూడా జరిగింది. అయితే, ఆ వ్యక్తిని మరుసటి రోజు బీహార్ నుండి అరెస్టు చేశారు. అతన్ని రాకేష్ కుమార్ శర్మగా గుర్తించారు. ఇది మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కనుగొన్నారు.
Read Also:Kotha Prabhakar: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?