Mukhesh Ambani: ముకేశ్ అంబానీకి 4రోజుల్లో మూడు బెదిరింపు మెయిల్స్.. ఈ సారి రూ.400కోట్లు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukhesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీకి వారంలో మూడోసారి మెయిల్లో హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి బెదిరింపులు రూ.400 కోట్లు ఇవ్వలన్న డిమాండ్ వచ్చింది. ఇంతకు ముందు శనివారం కూడా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి రూ.20 కోట్లు అడిగారని, మరుసటి రోజే రూ.200 కోట్లకు పెంచారన్నారు. ఈసారి మెయిల్లో బెదిరించిన వ్యక్తి రూ. 400 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు పోలీసులు నన్ను అరెస్టు చేయలేరు అని కూడా రాశారు. మునుపటి రెండు ఇమెయిల్లు వచ్చిన చిరునామా నుండి ఈ ఇమెయిల్ కూడా వచ్చింది.
IP అడ్రస్ బెల్జియం నుంచి
ముంబై పోలీసులు ఇప్పటికీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే రెండు పాత ఇమెయిల్ల IP చిరునామాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, ఇంటర్పోల్ ద్వారా ఈ ఇమెయిల్ వివరాలను ధృవీకరించడంలో బెల్జియన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీ (VPN) నుండి సహాయం కోరింది. ఈ మెయిల్లు shadabkhan@mailfence.com నుండి పంపబడ్డాయి. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ IP చిరునామా బెల్జియంకు చెందినది. అయితే బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి వేరే దేశంలో ఉన్నాడని, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బెల్జియం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
Read Also:Chandrababu: ఆ తర్వాతే జైలు నుంచి బయటకు చంద్రబాబు..!
నన్ను కనిపెట్టండి చూద్దాం
గత రెండు మెయిల్స్ తర్వాత సోమవారం పంపిన మూడో ఇమెయిల్లో బెదిరింపు చేస్తున్న వ్యక్తి ఇలా రాశాడు, ‘ఇప్పుడు మా డిమాండ్ను రూ.400 కోట్లకు పెంచాం. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయలేరు’ అని మెయిల్లో రాసుకొచ్చాడు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలి మెయిల్లో రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. శనివారం రెండో మెయిల్లో రూ.200 కోట్లకు పెంచారు. మహారాష్ట్రలోని క్రైమ్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ సెల్ సంయుక్తంగా దీనిపై విచారణ జరుపుతున్నాయి. కేవలం బెదిరింపుల కోసమే ఈ మెయిల్ అడ్రస్ను రూపొందించినట్లు ఫస్ట్ లుక్లో కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు.
మొదట బాంబు బెదిరింపు
ముఖేష్ అంబానీ, అతడి కుటుంబానికి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరు 5న రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ఓ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆసుపత్రిని బాంబుతో పేల్చివేయాలనే చర్చ కూడా జరిగింది. అయితే, ఆ వ్యక్తిని మరుసటి రోజు బీహార్ నుండి అరెస్టు చేశారు. అతన్ని రాకేష్ కుమార్ శర్మగా గుర్తించారు. ఇది మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కనుగొన్నారు.
Read Also:Kotha Prabhakar: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు..
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!