Reliance AGM 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ లో 30 వేల ఉద్యోగాలు? అంబానీ ప్రకటన..
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం
- రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ
- త్వరలో 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది. రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనే రెండు కంపెనీల ఐపీఓకి సంబంధించిన చిత్రాన్ని రిలయన్స్ ఛైర్మన్ చూయించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై సంస్థ దృష్టి సారించిందని, గతేడాది కొత్తగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఛైర్మన్ అంబానీ చెప్పారు.
READ MORE: Abudhabi Prince: వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్లో పర్యటన..!
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతూ .. ఫుడ్ ప్రొవైడర్ను ఎనర్జీ ప్రొవైడర్గా మార్చడమే తమ లక్ష్యం అని, కంపెనీ నిరంతరం బయో ఎనర్జీ వ్యాపారంపై దృష్టి సారిస్తోందని అన్నారు. 2025 నాటికి 55 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, బయో ఎనర్జీ వ్యాపారం ద్వారా దాదాపు 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. రిలయన్స్ ఛైర్మన్ జామ్నగర్లో బయో ఎనర్జీ డీప్ టెక్ సెంటర్ను ఏర్పాటు చేయడం గురించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సోలార్ పివి వ్యాపారంలోకి ప్రవేశించడంపై ఆయన మాట్లాడారు.
READ MORE: Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి
కాగా.. జియో యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. దీపావళి నుంచి జియో ఏఐ (Jio AI) క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ను ప్రారంభించనున్నట్లు ఆకాష్ అంబానీ తెలిపారు. జియో హోమ్ (Jio Home) కి కొత్త ఫీచర్లు కూడా జోడించబడ్డాయన్నారు. ఏఐ ద్వారా జియో సెటప్ బాక్స్ను ఉపయోగించడం మరింత సులభం అవుతుందని తెలిపారు. హలో జియో ద్వారా సెటప్ బాక్స్ను రన్ చేయడం సులభంగా మారుతుందన్నారు. సెటప్ బాక్స్లో జియో టీవీ ఓఎస్ని లాంచ్ చేశామని చెప్పారు.
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!