Pawan Kalyan: ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు. పెద్దలు పది మాటలు అంటారు.. నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్ళండి.. ఆయనకు చెప్పి నేను తీసుకువస్తానని పద్మనాభం కుమార్తె క్రాంతితో పవన్ అన్నారు. తండ్రిని కూతురిని వేరు చేసే వ్యక్తిని కానన్నారు. తండ్రి బాధను, కూతురు బాధ్యతను అర్థం చేసుకోగలనని తెలిపారు. ముద్రగడ వైసీపీకి వెళ్లిన నాకు ఇబ్బంది లేదు గౌరవిస్తానని పేర్కొన్నారు.
READ MORE: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ‘బ్లూ కార్నర్’ నోటీస్ జారీ.. ఈ నోటీసులు అంటే ఏమిటి..?
Also Read
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తాండవ నది ద్వారా ఇసుక దోచుకున్నారని.. తాండవ నదికి రిటర్నింగ్ వాల్ నిర్మించలేకపోయారన్నారు. ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలన్నా అధికారులు లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. కుటమీ ప్రభుత్వ రాగానే హ్యాచరీస్ స్వేచ్ఛలో ఇస్తామన్నారు. తుని అంటే రైలు దుర్ఘటన కాదని..తుని అంటే ఒక దేవాలయాలతో కూడిన నిలయమన్నారు. వాణిజ్య వ్యాపారాలకు సువిశాలంగా ఉండే ప్రాంతంగా గుర్తించాలని తాను 2018లో తుని వచ్చినట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కూడా సుమారు 25 సంవత్సరాల నుంచి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే మోడీ గారితో మాట్లాడి ఏబీసీడీ వర్గీకరణ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దాడిశెట్టి రాజాకు ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో పెట్టినట్టే అని విమర్శించారు. టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!