MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్గా కూడా..!
- మహేంద్ర సింగ్ ధోని AI స్టార్టప్ ‘కుకు’లో పెట్టుబడి
- కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్గా ధోని ఎంపిక
- పెట్టుబడి ఆర్థిక వివరాలు వెల్లడించని సంస్థ
- 2018లో స్థాపించబడిన కుకు సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Invests: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మొబైల్ స్టోరీటెల్లింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘కుకు’ (Kuku) లో ధోని భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో పాటు.. కుకు సంస్థకు చెందిన మైక్రో డ్రామా యాప్ ‘కుకు టీవీ’ (Kuku TV) కి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. అయితే ఈ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ వెల్లడించలేదు.
IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. చిన్న పట్టణాల నుండి వచ్చిన వ్యవస్థాపకులు ఇంతటి స్థాయికి ఎదగడం నాకు చాలా గర్వంగా ఉంది. భారత్ కోసం, భారత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగే ఏఐ ఆధారిత ప్లాట్ ఫామ్ ను నిర్మించాలనే వారి దార్శనికతపై నాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. 2018లో లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ కుమార్ మీనాలు స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కుకు టీవీ (మైక్రో డ్రామాలు), కుకు ఎఫ్ఎమ్ (ఆడియో స్టోరీస్) వంటి వివిధ యాప్ లను నిర్వహిస్తోంది.
భారతదేశంలో ప్రస్తుతం మైక్రో డ్రామా (చిన్న నిడివి గల నాటకాలు) మార్కెట్ లో శరవేగంగా దూసుకుపోతున్నాయి. 2025 నాటికి ఈ మార్కెట్ విలువ 300 మిలియన్ డాలర్లు దాటగా, 2026 చివరి నాటికి ఇది 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కుకు సంస్థ ఇప్పటికే 350 మిలియన్లకు పైగా ఇన్ స్టాల్ లను కలిగి ఉంది. ఇది మొత్తం 7 భాషల్లో 20 వేలకు పైగా టైటిల్స్ తో ఈ ప్లాట్ ఫామ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ఈ సంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్’ (IIZ) అనే హిందీ చిత్రంతో థియేట్రికల్ రంగంలోకి కూడా ప్రవేశించింది.
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్, అక్టోబర్ 2025లో గ్రానైట్ ఆసియా నేతృత్వంలో సుమారు 85 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ధోని వంటి లెజండ్ వ్యక్తి తోడవడంతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని కుకు వ్యవస్థాపకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలోనే ఈ సంస్థ మైథో-ఫాంటసీ, సూపర్ హీరో కథాంశాలతో కూడిన ఏఐ ఒరిజినల్ మైక్రో డ్రామాలను విడుదల చేసి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!