MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్గా కూడా..!
- మహేంద్ర సింగ్ ధోని AI స్టార్టప్ ‘కుకు’లో పెట్టుబడి
- కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్గా ధోని ఎంపిక
- పెట్టుబడి ఆర్థిక వివరాలు వెల్లడించని సంస్థ
- 2018లో స్థాపించబడిన కుకు సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Invests: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మొబైల్ స్టోరీటెల్లింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘కుకు’ (Kuku) లో ధోని భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో పాటు.. కుకు సంస్థకు చెందిన మైక్రో డ్రామా యాప్ ‘కుకు టీవీ’ (Kuku TV) కి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. అయితే ఈ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ వెల్లడించలేదు.
IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
Also Read
- Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
- Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
- Harry Brook: "టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే".. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. చిన్న పట్టణాల నుండి వచ్చిన వ్యవస్థాపకులు ఇంతటి స్థాయికి ఎదగడం నాకు చాలా గర్వంగా ఉంది. భారత్ కోసం, భారత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగే ఏఐ ఆధారిత ప్లాట్ ఫామ్ ను నిర్మించాలనే వారి దార్శనికతపై నాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. 2018లో లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ కుమార్ మీనాలు స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కుకు టీవీ (మైక్రో డ్రామాలు), కుకు ఎఫ్ఎమ్ (ఆడియో స్టోరీస్) వంటి వివిధ యాప్ లను నిర్వహిస్తోంది.
భారతదేశంలో ప్రస్తుతం మైక్రో డ్రామా (చిన్న నిడివి గల నాటకాలు) మార్కెట్ లో శరవేగంగా దూసుకుపోతున్నాయి. 2025 నాటికి ఈ మార్కెట్ విలువ 300 మిలియన్ డాలర్లు దాటగా, 2026 చివరి నాటికి ఇది 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కుకు సంస్థ ఇప్పటికే 350 మిలియన్లకు పైగా ఇన్ స్టాల్ లను కలిగి ఉంది. ఇది మొత్తం 7 భాషల్లో 20 వేలకు పైగా టైటిల్స్ తో ఈ ప్లాట్ ఫామ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ఈ సంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్’ (IIZ) అనే హిందీ చిత్రంతో థియేట్రికల్ రంగంలోకి కూడా ప్రవేశించింది.
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్, అక్టోబర్ 2025లో గ్రానైట్ ఆసియా నేతృత్వంలో సుమారు 85 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ధోని వంటి లెజండ్ వ్యక్తి తోడవడంతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని కుకు వ్యవస్థాపకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలోనే ఈ సంస్థ మైథో-ఫాంటసీ, సూపర్ హీరో కథాంశాలతో కూడిన ఏఐ ఒరిజినల్ మైక్రో డ్రామాలను విడుదల చేసి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.
తాజావార్తలు
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!