IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
- కోహ్లీ, రోహిత్ మధ్య బ్యాటింగ్ స్టైల్ తేడాపై అశ్విన్ వ్యాఖ్యలు
- కోహ్లీ – ఇన్నింగ్స్ను నిర్మిస్తూ స్థిరంగా ఆడే ఆటగాడు
- రోహిత్ – మొదటి నుంచే దూకుడుగా ఆడే శైలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ శైలి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనూ సుదీర్ఘకాలం కలిసి ఆడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారని పేర్కొన్నారు.
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Also Read
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
ఇందుకు సంబంధించి అశ్విన్ విశ్లేషిస్తూ.. కోహ్లీ ఎప్పుడూ ఇన్నింగ్స్ ను నిలకడగా నిర్మిస్తూ అటెన్షన్ గా ఉండటానికి కోరుకుంటారని, అదే రోహిత్ శర్మ అయితే మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపిఎల్ చరిత్రలోనే 200 పైచిలుకు పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా బెంగుళూరు రికార్డు నెలకొల్పింది. ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కోహ్లీతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61), కెప్టెన్ రజత్ పటిదార్ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో బెంగుళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మరోవైపు ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఫామ్ ను నిరూపించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ కేవలం 38 బంతుల్లో 78 పరుగులు చేసి పాత రోజులను గుర్తు చేశారు. పవర్ ప్లేలోనే ముంబై 80 పరుగులు సాధించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో టి20 క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రోహిత్, ఈ సీజన్ అంతా ఇదే దూకుడును కొనసాగిస్తారని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?