IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
- కోహ్లీ, రోహిత్ మధ్య బ్యాటింగ్ స్టైల్ తేడాపై అశ్విన్ వ్యాఖ్యలు
- కోహ్లీ – ఇన్నింగ్స్ను నిర్మిస్తూ స్థిరంగా ఆడే ఆటగాడు
- రోహిత్ – మొదటి నుంచే దూకుడుగా ఆడే శైలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ శైలి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనూ సుదీర్ఘకాలం కలిసి ఆడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారని పేర్కొన్నారు.
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
ఇందుకు సంబంధించి అశ్విన్ విశ్లేషిస్తూ.. కోహ్లీ ఎప్పుడూ ఇన్నింగ్స్ ను నిలకడగా నిర్మిస్తూ అటెన్షన్ గా ఉండటానికి కోరుకుంటారని, అదే రోహిత్ శర్మ అయితే మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపిఎల్ చరిత్రలోనే 200 పైచిలుకు పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా బెంగుళూరు రికార్డు నెలకొల్పింది. ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కోహ్లీతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61), కెప్టెన్ రజత్ పటిదార్ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో బెంగుళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మరోవైపు ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఫామ్ ను నిరూపించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ కేవలం 38 బంతుల్లో 78 పరుగులు చేసి పాత రోజులను గుర్తు చేశారు. పవర్ ప్లేలోనే ముంబై 80 పరుగులు సాధించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో టి20 క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రోహిత్, ఈ సీజన్ అంతా ఇదే దూకుడును కొనసాగిస్తారని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!