IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
- కోహ్లీ, రోహిత్ మధ్య బ్యాటింగ్ స్టైల్ తేడాపై అశ్విన్ వ్యాఖ్యలు
- కోహ్లీ – ఇన్నింగ్స్ను నిర్మిస్తూ స్థిరంగా ఆడే ఆటగాడు
- రోహిత్ – మొదటి నుంచే దూకుడుగా ఆడే శైలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ శైలి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనూ సుదీర్ఘకాలం కలిసి ఆడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారని పేర్కొన్నారు.
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
ఇందుకు సంబంధించి అశ్విన్ విశ్లేషిస్తూ.. కోహ్లీ ఎప్పుడూ ఇన్నింగ్స్ ను నిలకడగా నిర్మిస్తూ అటెన్షన్ గా ఉండటానికి కోరుకుంటారని, అదే రోహిత్ శర్మ అయితే మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపిఎల్ చరిత్రలోనే 200 పైచిలుకు పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా బెంగుళూరు రికార్డు నెలకొల్పింది. ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కోహ్లీతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61), కెప్టెన్ రజత్ పటిదార్ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో బెంగుళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మరోవైపు ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఫామ్ ను నిరూపించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ కేవలం 38 బంతుల్లో 78 పరుగులు చేసి పాత రోజులను గుర్తు చేశారు. పవర్ ప్లేలోనే ముంబై 80 పరుగులు సాధించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో టి20 క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రోహిత్, ఈ సీజన్ అంతా ఇదే దూకుడును కొనసాగిస్తారని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!