Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ms Dhoni Files Criminal Case Against Ex Business Partners Claims Cheating Of Over Rs 15 Crore

MS Dhoni: రూ.15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్‌ కేసు పెట్టిన ఎంఎస్ ధోనీ

Published Date :January 5, 2024 , 4:14 pm
By Mahesh Jakki
MS Dhoni: రూ.15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్‌ కేసు పెట్టిన ఎంఎస్ ధోనీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్‌ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు దివాకర్ 2017లో ఎంఎస్‌డీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

అయితే అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిబంధనలను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము, షేర్ లాభాలను చెల్లించవలసి ఉంది. కానీ, మిహిర్ దివాకర్, సౌమ్య బిస్వాస్ ఆ షరతును నెరవేర్చలేకపోయారు. దాంతో ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

Read Also: ACB Trap: పాల బిల్లు చెల్లించేందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్..!

‘ధోనిని ఆర్కా స్పోర్ట్స్ మోసం చేసింది’
ధోని అనేక లీగల్ నోటీసులు పంపినప్పటికీ, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు, షరతులు విస్మరించబడ్డాయి, దీనితో ధోనీ ఆగస్టు 15, 2021న సంస్థకు ఇచ్చిన అధికార లేఖను రద్దు చేశాడు. ధోనీ అనేక సార్లు లీగల్ నోటీసులు పంపాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆర్కా స్పోర్ట్స్ మోసం చేసిందని, దీంతో రూ.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కోర్టులో ధోనీ తరపున వాదించిన దయానంద్ సింగ్ తెలిపాడు. ఆర్కా స్పోర్ట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత మిహిర్ దివాకర్ తనను బెదిరించాడని, దుర్భాషలాడాడని ఆరోపిస్తూ ధోనీ స్నేహితుడు చిట్టుగా ప్రసిద్ధి చెందిన సిమంత్ లోహానీ కూడా ఫిర్యాదు చేశాడు.

ఎంఎస్ ధోని ఇటీవలే తన నూతన సంవత్సరాన్ని దుబాయ్‌లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ధోనీ తన కుటుంబం, స్నేహితులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నట్లు కనిపించాడు. ఈ పర్యటనలో ధోనీతో పాటు భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. ధోనీ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో క్రిస్మస్ జరుపుకున్నాడు. మొదటిసారిగా డిసెంబర్ 19న యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2024 మినీ వేలం కోసం దుబాయ్ చేరుకున్న తర్వాత రిషబ్ పంత్ ఎంఎస్‌ ధోనిని కలిశాడు. డిసెంబరు 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్‌ పంత్.. ఐపీఎల్‌ వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం కూర్చున్నాడు.ఎంఎస్‌ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ ఐపీఎల్‌ 2024 సమయంలో పోటీలోకి దిగనున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aarka Sports and Management Limited
  • cheating
  • cricket
  • criminal case
  • mahendra singh dhoni

తాజావార్తలు

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions