LSG vs CSK: మెరిసిన ధోనీ, దూబే.. 5 ఓటముల తర్వాత చెన్నై విజయం
- 5 ఓటముల తర్వాత చెన్నై విజయం
- మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఎంఎస్ ధోనీ
- ఎల్ఎస్జీని కట్టడి చేసిన నూర్ అహ్మద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. అయిదు ఓటముల తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎంఎస్ ధోనీ (26 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శివమ్ దూబే (43 నాటౌట్; 37 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. అంతకు ముందు చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ (0/13) ఎల్ఎస్జీని కట్టడి చేశాడు. ఈ విజయంతో సీఎస్కే ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఇడెన్ మార్క్రమ్ (6), నికోలస్ పూరన్ (4) విఫలమవడంతో లేకనో ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఈ సమయంలో మిచెల్ మార్ష్ (30; 25 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి రిషబ్ పంత్ (63; 49 బంతుల్లో 4×4, 4×6) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. మార్ష్ అవుట్ అయ్యాక ఆయుష్ బదోని (22), అబ్దుల్ సమద్ (20)ల సహకారంతో పంత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 18, 19 ఓవర్లలో పంత్ సిక్సర్లు బాదడంతో ఎల్ఎస్జీ స్కోర్ 150 దాటింది. చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. జడేజా (2/24), పతిరన (2/45) రాణించారు.
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఛేదనలో చెన్నైకి మంచి ఆరంభం దక్కింది. షేక్ రషీద్ 27; 19 బంతుల్లో 6×4) బౌండరీల మోత మోగించాడు. రచిన్ రవీంద్ర (37; 22 బంతుల్లో 5×4) నిలకడగా ఆడడంతో చెన్నై 4 ఓవర్లకు 45 పరుగులు చేసింది. అయితే ఊపుమీదున్న రషీద్ను అవేష్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికి రచిన్ను మార్క్రమ్ ఔట్ చేసి కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు రవి బిష్ణోయ్ (2/18), దిగ్వేశ్ రాఠి (1/23) కూడా సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లలో చెన్నై 56 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎంఎస్ ధోనీ చెలరేగాడు. శార్దూల్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రావడంతో.. చెన్నైకి ఆఖరి ఓవర్లో 5 పరుగులే అవసరం అయ్యాయి. దూబే ఫోర్ కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!