30Kg Tumor : రోగి కడుపులో 30కేజీల కణతి.. ఆపరేషన్కు ఆరుగంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30Kg Tumor : వారణాసిలోని మహామన పండిట్ మదన్ మోహన్ మాల్వియా క్యాన్సర్ సెంటర్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతిరోజూ క్యాన్సర్ చికిత్స రంగంలో కొత్త విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆసుపత్రి వైద్యులు చాలా క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్స చేసి రోగి కడుపు నుండి 30.5 కిలోల కణితిని తొలగించారు. కణితి పరిమాణం చాలా పెద్దదిగా ఉండడంతో రోగికి నడవడం కష్టతరమైంది. శస్త్ర చికిత్స చేసి ఆ రోగికి కొత్త జీవితాన్ని అందించారు ఆస్పత్రి వైద్యులు.
ఒక 55 ఏళ్ల వ్యక్తి పొత్తికడుపు వాపు రావడంతో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు రోగి కడుపులో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం క్యాన్సర్ ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం అసోసియేట్ ప్రొఫెసర్. మయాంక్ త్రిపాఠి, అతని బృందం (డా. విదుర్, డాక్టర్. రవీంద్ర వర్మ) శస్త్రచికిత్స చేశారు.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
Read Also: Viral: ఏం ఐడియా రా బాబు… నువ్వు కేక అంతే
రోగికి రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమా అనే అరుదైన క్యాన్సర్ ఉందని డాక్టర్ మయాంక్ త్రిపాఠి తెలిపారు. ఈ కణితి రోగి ఉదరం లోపల ప్రధాన రక్త నాళాల దగ్గర ఉంది. కణితి పరిమాణం చాలా పెద్దది కావడం, చాలా సున్నితమైన ప్రదేశంలో ఉండటంతో, దానిని తొలగించడానికి 6 గంటల పాటు నిరంతర శస్త్రచికిత్స జరిగింది. రోగి కడుపు నుండి తొలగించిన కణితి పరిమాణం 64 సెం.మీ. పొడవు, 46 సెం.మీ. వెడల్పుగా ఉంది. ఇది ఇప్పటివరకు దేశంలో రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమా క్యాన్సర్ కణితి. కణితి బరువు 12 నవజాత శిశువుల బరువుకు సమానంగా పేర్కొన్నారు.
రోగికి రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమాతో పాటు కిడ్నీ క్యాన్సర్ కూడా ఉంది. శస్త్రచికిత్స సమయంలో రెండు కణితులను కలిపి తొలగించారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వారా 10-12 కిలోల కణితులను తరచుగా తొలగిస్తారని, అయితే ఇప్పటివరకు ఇంత భారీ కణితిని తొలిసారిగా విజయవంతంగా తొలగించామని డాక్టర్ మయాంక్ త్రిపాఠి తెలిపారు.
Read Also: Governor Tamilisai: యాదాద్రి నరసింహ స్వామి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై
క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సత్యజిత్ ప్రధాన్, శస్త్రచికిత్స చేసిన బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో పని చేసేలా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య కేన్సర్ సెంటర్, హోమీ భాభా కేన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్కు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన, అతిపెద్ద శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!