Mp Rammohan Naidu: చంద్రబాబుని చూస్తే జగన్ కి అంత భయమా?
ఏపీలో పాలనపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు. నిన్న కుప్పంలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజు. అసలు రాష్ట్రం భారతదేశంలో ఒక భాగమా కాదా అనే సందేహం కలుగుతుంది.ఒక శాసన సభ్యుడు గా చంద్రబాబు కుప్పంలో తిరగడానికి ఎవరు పర్మిషన్ కావాలని అడుగుతున్నాను. ప్రతిపక్షం తిరగకుండా చేసేందుకే జగన్ చీకటి జీవోలను తీసుకొచ్చారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో ఈ చీకటి జీవోలే నిదర్శనం.
గత సంవత్సర కాలం నుంచి ప్రజల వద్దకు చంద్రబాబు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు నడిపేందుకు సర్వశక్తులు దారపోస్తానంటూ ప్రజలకి ధైర్యం ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. బాబు సభలకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక చంద్రబాబుని తిరగకుండా కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పులను బాబు ఎత్తి చూపుతున్నారు.ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో అప్పుడే రాష్ట్రాన్ని కూల్చటం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
Read ALso: Veera Simha Reddy Pre Release Event Live: ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్
కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలులా పనిచేస్తున్నారు. ఒక పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. బరితెగించి పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఒక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లినా పోలీసులు సహకరించి సరైన బందోబస్తు కల్పించాలి. పోలీసులు బాబు సభలకు సరైన భద్రత కల్పించి ఉంటే ఎలాంటి ఘటనలూ జరిగేవి కావు.చంద్రబాబును జనాలకు దూరం చేస్తే మళ్లీ గెలుస్తారని జగన్ భ్రమలో ఉన్నారు.ఆయన ఎన్ని చీకటి జీవోలు తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఎంత ఖూనీ చేసినా టీడీపీని ఆపలేరు.
నిన్నటి ఘటనతో జగన్ పని అయిపోయింది.వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ప్రజాస్వామ్య వ్యతిరేకమైన జీవో. ప్రతిపక్షాలకు ప్రజల దగ్గరకు వెళ్లేందుకు అన్ని రకాలుగా రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లోప్రజాస్వామ్యం లేదు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు ఎంపీ రామ్మోహన నాయుడు.
Read ALso: Chandrababu Naidu: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!