Mp Rammohan Naidu: చంద్రబాబుని చూస్తే జగన్ కి అంత భయమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పాలనపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు. నిన్న కుప్పంలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజు. అసలు రాష్ట్రం భారతదేశంలో ఒక భాగమా కాదా అనే సందేహం కలుగుతుంది.ఒక శాసన సభ్యుడు గా చంద్రబాబు కుప్పంలో తిరగడానికి ఎవరు పర్మిషన్ కావాలని అడుగుతున్నాను. ప్రతిపక్షం తిరగకుండా చేసేందుకే జగన్ చీకటి జీవోలను తీసుకొచ్చారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో ఈ చీకటి జీవోలే నిదర్శనం.
గత సంవత్సర కాలం నుంచి ప్రజల వద్దకు చంద్రబాబు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు నడిపేందుకు సర్వశక్తులు దారపోస్తానంటూ ప్రజలకి ధైర్యం ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. బాబు సభలకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక చంద్రబాబుని తిరగకుండా కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పులను బాబు ఎత్తి చూపుతున్నారు.ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో అప్పుడే రాష్ట్రాన్ని కూల్చటం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
Read ALso: Veera Simha Reddy Pre Release Event Live: ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్
కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలులా పనిచేస్తున్నారు. ఒక పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. బరితెగించి పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఒక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లినా పోలీసులు సహకరించి సరైన బందోబస్తు కల్పించాలి. పోలీసులు బాబు సభలకు సరైన భద్రత కల్పించి ఉంటే ఎలాంటి ఘటనలూ జరిగేవి కావు.చంద్రబాబును జనాలకు దూరం చేస్తే మళ్లీ గెలుస్తారని జగన్ భ్రమలో ఉన్నారు.ఆయన ఎన్ని చీకటి జీవోలు తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఎంత ఖూనీ చేసినా టీడీపీని ఆపలేరు.
నిన్నటి ఘటనతో జగన్ పని అయిపోయింది.వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ప్రజాస్వామ్య వ్యతిరేకమైన జీవో. ప్రతిపక్షాలకు ప్రజల దగ్గరకు వెళ్లేందుకు అన్ని రకాలుగా రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లోప్రజాస్వామ్యం లేదు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు ఎంపీ రామ్మోహన నాయుడు.
Read ALso: Chandrababu Naidu: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు
తాజావార్తలు
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!