MP: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి మాత్రం ఏదో తక్కువైంది. ఏం తక్కువై ఉంటుంది? అని ఆలోచిస్తు్న్నారా? ఆయనకు లడ్డూ ఇవ్వలేదు. అదే పెద్ద లోటుగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తం ఏకంగా సీఎంకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో గ్రామ పంచాయతీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.