MP K.Laxman : కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగం మారుస్తారని ఖర్గే అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ముస్లిం, పాకిస్థాన్ వంటి దేశాల్లో హిందువులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, వారిని ఆదుకునేందుకే సీఏఏ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ దీనిపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాకిస్థాన్ ఒక మతపరమైన రాజ్యంగా కొనసాగుతోందని, ముస్లిం దేశాల్లోలేని భద్రత భారత దేశంలో మైనార్టీ వర్గాలకు ఉందన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, దీనివల్ల ఎవరికీ నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు ఎంపీ లక్ష్మణ్.
అంతేకాకుండా.’ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొట్టి, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. చిదంబరం నరనరాన హిందువులపై వ్యతిరేక భావన ఉంది. సీఏఏను ఎవ్వరూ రద్దు చేయలేరు. దీనిపై చిదంబరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ తీరు. వాళ్ళు కూడా రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించిన పార్టీ కాంగ్రెస్. నెహ్రూ కుటుంబం తప్ప ఎవరూ పాలించొద్దనే భావనలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వందసార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ఇందిరా గాంధీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించారు. ఒక్క కుటుంబం చేతిలో కాంగ్రెస్ బందీ అయిపోయింది. ఇండియా కూటమి రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పలేక పోతున్నాయి. ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ కాంగ్రెస్ కు 40సీట్లు రావని చెప్పింది. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయింది.. భవిష్యత్ లో కాంగ్రెస్ పని కూడా అంతే. 40 సీట్లు కూడా రాని కాంగ్రెస్ కు రావు.. వాళ్ళు రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు. ఎన్ని వేధింపులకి గురిచేసినా.. గెలుపు బీజేపీదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
- CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
తాజావార్తలు
-
Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
-
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్పై కొత్త దాడులకు బ్రేక్..
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
-
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
-
Kangana Ranaut: “మంటకు ఆజ్యం పోయవద్దు!” హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!