MP K.Laxman : కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగం మారుస్తారని ఖర్గే అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ముస్లిం, పాకిస్థాన్ వంటి దేశాల్లో హిందువులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, వారిని ఆదుకునేందుకే సీఏఏ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ దీనిపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాకిస్థాన్ ఒక మతపరమైన రాజ్యంగా కొనసాగుతోందని, ముస్లిం దేశాల్లోలేని భద్రత భారత దేశంలో మైనార్టీ వర్గాలకు ఉందన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, దీనివల్ల ఎవరికీ నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు ఎంపీ లక్ష్మణ్.
అంతేకాకుండా.’ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొట్టి, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. చిదంబరం నరనరాన హిందువులపై వ్యతిరేక భావన ఉంది. సీఏఏను ఎవ్వరూ రద్దు చేయలేరు. దీనిపై చిదంబరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ తీరు. వాళ్ళు కూడా రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు. ప్రధానిని అవమానించిన పార్టీ కాంగ్రెస్. నెహ్రూ కుటుంబం తప్ప ఎవరూ పాలించొద్దనే భావనలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వందసార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ఇందిరా గాంధీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించారు. ఒక్క కుటుంబం చేతిలో కాంగ్రెస్ బందీ అయిపోయింది. ఇండియా కూటమి రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పలేక పోతున్నాయి. ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ కాంగ్రెస్ కు 40సీట్లు రావని చెప్పింది. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయింది.. భవిష్యత్ లో కాంగ్రెస్ పని కూడా అంతే. 40 సీట్లు కూడా రాని కాంగ్రెస్ కు రావు.. వాళ్ళు రాజ్యాంగంపై మాట్లాడుతున్నారు. ఎన్ని వేధింపులకి గురిచేసినా.. గెలుపు బీజేపీదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?