MP GVL Narasimha Rao: ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భద్రతా సమస్యలు.. రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP GVL Narasimha Rao: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో 15 మంది మృతిచెందారు.. 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భద్రతా సమస్యలపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు.. హౌరా-చెన్నై ప్రధాన లైన్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రైలు భద్రతపై క్రమబద్ధమైన మరియు విస్తృత సమీక్షను కోరారు.. వాల్తేర్ రైల్వే డివిజన్లోని అలమండ మరియు కంటకపల్లె మధ్య విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కనీసం 14 మంది మృతి చెందిన ఘోర రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కేవలం ఐదు నెలల వ్యవస్థలో రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Governor Tamilisai: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. డీజీపీకి గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఇక, ఈ ఏడాది జూన్లో ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ కు జరిగిన ఘోర ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణం చెందిన విషయం గుర్తు చేస్తూ, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోని ప్రధాన హౌరా-చెన్నై లైన్ లోనే ఆ ప్రమాదం కూడా ప్రమాదం జరిగిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖపట్నంలో నివసిస్తున్న పార్లమెంటు సభ్యునిగా మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క జోనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యునిగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య రైళ్ల భద్రత గురించి నా తీవ్రమైన ఆందోళనను తెలియపరుస్తున్నాను అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖ పేర్కొన్నారు. రైలు భద్రతపై సమీక్ష జరపాలని కోరుతూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ‘‘ఐదు నెలల స్వల్ప వ్యవధిలో జరిగిన పై రెండు ప్రమాదాల దృష్ట్యా, రైలు భద్రతపై క్రమపద్ధతిలో, విస్తృత సమీక్ష చేయవలసిన అవసరం ఉందని, తద్వారా రైలు ప్రమాదాలు అరికట్టడమే కాకుండా ప్రయాణీకులకు భద్రతా భావాన్ని కలిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులను మరియు మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకున్నందుకు రైల్వే మంత్రి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణీకుల భద్రత మరియు భారతీయ రైల్వేలపై జాతీయ నమ్మకాన్ని నిలబెట్టే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశభావం వ్యక్తం చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..