MP Bastipati Nagaraju: విజయసాయి రెడ్డి.. సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది: కర్నూలు ఎంపీ
- కేవీ రావును అప్పట్లో బాగా బెదిరించారు
- సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు
- రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తనతో చర్చకు రావాలని, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదని ఎంపీ నాగరాజు సవాల్ చేశారు.
ఢిల్లీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ… ‘విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవి రావును అప్పట్లో బాగా భయపెట్టారుఎం బెదిరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారు. ఢిల్లీలో కూర్చుని మాట్లాడినంత మాత్రాన అన్నీ నిజాలైపోవు. మా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గురించి చాలా దిగజారి మాట్లాడారు. మీ హయాంలో వేల కోట్లు అప్పులు చేసి.. రాష్ట్రం దివాలా తీసేలా చేశారు. విజయసాయి రెడ్డి.. నాతో చర్చకు కూర్చో, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది’ అని ఫైర్ అయ్యారు.
Also Read
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
‘ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ పేరుతో రైతుల భూమి కాజేయాలని చూశారు. మేము సరిదిద్ది రైతుల భూములను కాపాడాం. కేవీ రావును మీ హయాంలో చాలా భయపెట్టారు. ఢిల్లీలో కూర్చుంటే సరిపోదు. మీ అరాచకాలన్నీ బయటకు వస్తాయి, సిద్ధంగా ఉండండి. ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదు. ఒక రెండు సీట్లు తగ్గి ఉంటే వైసీపీకి ‘నవ రత్నాలు’ మిగిలేవి. కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరిగాయి. నిదానంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి’ అని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!