Extra-Marital Affairs: రెండేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి.. వెలుగులోకి సంచలన విషయాలు.. గతంలోనూ ప్రియుడితో జంప్
- రెండేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి
- వెలుగులోకి సంచలన విషయాలు
- గతంలోనూ ప్రియుడితో జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడిమోజులో పడి కన్న కూతురును కాటికిపంపింది కసాయి తల్లి. కడుపు తీపి లేని ఆ తల్లికి కన్నపేగు బంధానికంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. కాగా మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక, ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకుని ఇద్దరు పిలల్లతో కలిసి పుట్టింటికి వచ్చిన మమత.. అదే గ్రామానికి చెందిన ఫయాజ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Also Read:PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్ను ప్రారంభించిన మోడీ
Also Read
ప్రియుడితో వెళ్లిపోవడానికి.. తన భర్త భాస్కర్ పురుగుల మందు తాగాడని మమత తల్లిదండ్రులను నమ్మించింది. హాస్పిటల్ కి వెళ్లి వస్తానని తన ఐదేళ్ల కొడుకుని తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి రెండేళ్ల కూతురు తను శ్రీ ని వెంట తీసుకువెళ్లి ప్రియుడితో పరార్ అయ్యింది. సాయంత్రం అల్లుడు భాస్కర్ కి మమత తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో మమత బాగోతం బయటపడింది. గతంలోనూ ప్రియుడు ఫయాజ్ తో వెళ్లిపోగా తల్లిదండ్రులు నచ్చజెప్పినట్లు తెలిపారు. చిన్నారి తను శ్రీ హత్యకు గురైందన్న వార్తతో మమత తల్లిదండ్రులు కన్నిటిపర్యంతమవుతున్నారు. దారుణానికి ఓడగట్టిన కూతురు మమతకి ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ
కాగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఈ ఏడాది జూన్ 7వ తేదీన చిన్నారీ తను శ్రీని తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ హత్య చేశారు. కూతురు మమత, మనవరాలు తను శ్రీ కనిపించడం లేదంటూ శివంపేట పోలీసులకు తండ్రి రాజు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో మమత, ఫయాజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, నరసరావుపేటలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని చిన్నారి కోసం విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక, శభాష్ పల్లి శివారులో తను శ్రీ మృతదేహాన్ని పూడ్చిపెట్టామని చెప్పడంతో జేసీబీతో తవ్వగా.. కుళ్ళిన స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ కసాయి తల్లి మమతతో పాటు ప్రియుడు ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!