Mother Kills Daughter : కూతురి ప్రేమకు దారుణమైన శిక్ష.. టీనేజీ బాలికను తల నరికి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Kills Daughter : ఓ యువకుడితో ప్రేమలో ఉన్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా సదర్ కొత్వాలి మంఝన్పూర్ ప్రాంతంలోని తేజ్వాపూర్ గ్రామంలో 5 రోజుల క్రితం బావిలో తలలేని ఓ టీనేజ్ బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారని తెలిపారు. పోలీసులకు చిక్కిన తల్లి తన నేరాన్ని అంగీకరించి బాలికతో ప్రేమలో ఉన్న ప్రేమికుడిని ట్రాప్ చేయడానికి, తన కోడలుతో కలిసి కర్ర, గొడ్డలితో కొట్టి చంపినట్లు తెలిపింది. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. అయితే బాలిక తలను పోలీసులు ఇంకా వెలికితీయలేకపోయారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్ర, గోనె సంచిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Maratha Reservation: హింస ఆగకుంటే ఆ నిర్ణయం తీసుకుంటా.. మరాఠా కమ్యూనిటీ ప్రజలకు పాటిల్ విజ్ఞప్తి
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అక్టోబర్ 25న మంఝన్పూర్ కొత్వాలిలోని తేజ్వాపూర్ గ్రామంలోని పొలాల్లో పని చేస్తున్న వ్యక్తులు బావి నుండి దుర్వాసన వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు. పోలీసులు గ్రామస్తుల సహాయంతో తల లేని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై బట్టలు, కాలికి దారంను చూసి ఆమె ఎవరో గుర్తించారు.
కుటుంబ సభ్యులు కేసు పెట్టారు..
ఈ సమయంలో అక్టోబరు 2న కూతురు ఆవు పేడ వేయడానికి ఊరి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబీకులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు తమను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిర్దోషి అని గుర్తించిన పోలీసులు అతడిని విడిచిపెట్టారు. మృతదేహం లభ్యం కావడంతో ఘటనపై విచారణ చేపట్టిన కొత్వాలి పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: Kerala Blast: ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేరళ వరుస పేలుళ్ల బాధ్యుడు అరెస్ట్
హత్య కేసులో అత్త, కోడలు అరెస్ట్
విచారణలో మృతుడి తల్లి శివపతి తాను చేసిన నేరాన్ని అంగీకరించి అదే గ్రామానికి చెందిన యువకుడితో ఆ బాలిక ప్రేమ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు తెలిపారు. తన తల్లి అతనితో ప్రేమ వద్దని ఎంత చెప్పినా ఆ బాలిక వినలేదు. దీంతో ఆ తల్లికి కోపం వచ్చింది. ఆ బాలిక అందుకు నిరాకరించడంతో తల్లి ఆమెను హత్య చేసి యువకుడిని ట్రాప్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో అక్టోబరు 2వ తేదీ రాత్రి తన కోడలు మీరాతో కలిసి గొడ్డలి, కర్రతో కూతురిని హతమార్చింది. అనంతరం కూతురి మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి బావిలో పడేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!