Mother Kills Daughter : కూతురి ప్రేమకు దారుణమైన శిక్ష.. టీనేజీ బాలికను తల నరికి చంపిన తల్లి
Mother Kills Daughter : ఓ యువకుడితో ప్రేమలో ఉన్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా సదర్ కొత్వాలి మంఝన్పూర్ ప్రాంతంలోని తేజ్వాపూర్ గ్రామంలో 5 రోజుల క్రితం బావిలో తలలేని ఓ టీనేజ్ బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారని తెలిపారు. పోలీసులకు చిక్కిన తల్లి తన నేరాన్ని అంగీకరించి బాలికతో ప్రేమలో ఉన్న ప్రేమికుడిని ట్రాప్ చేయడానికి, తన కోడలుతో కలిసి కర్ర, గొడ్డలితో కొట్టి చంపినట్లు తెలిపింది. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. అయితే బాలిక తలను పోలీసులు ఇంకా వెలికితీయలేకపోయారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్ర, గోనె సంచిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Maratha Reservation: హింస ఆగకుంటే ఆ నిర్ణయం తీసుకుంటా.. మరాఠా కమ్యూనిటీ ప్రజలకు పాటిల్ విజ్ఞప్తి
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
అక్టోబర్ 25న మంఝన్పూర్ కొత్వాలిలోని తేజ్వాపూర్ గ్రామంలోని పొలాల్లో పని చేస్తున్న వ్యక్తులు బావి నుండి దుర్వాసన వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు. పోలీసులు గ్రామస్తుల సహాయంతో తల లేని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై బట్టలు, కాలికి దారంను చూసి ఆమె ఎవరో గుర్తించారు.
కుటుంబ సభ్యులు కేసు పెట్టారు..
ఈ సమయంలో అక్టోబరు 2న కూతురు ఆవు పేడ వేయడానికి ఊరి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబీకులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు తమను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిర్దోషి అని గుర్తించిన పోలీసులు అతడిని విడిచిపెట్టారు. మృతదేహం లభ్యం కావడంతో ఘటనపై విచారణ చేపట్టిన కొత్వాలి పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: Kerala Blast: ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేరళ వరుస పేలుళ్ల బాధ్యుడు అరెస్ట్
హత్య కేసులో అత్త, కోడలు అరెస్ట్
విచారణలో మృతుడి తల్లి శివపతి తాను చేసిన నేరాన్ని అంగీకరించి అదే గ్రామానికి చెందిన యువకుడితో ఆ బాలిక ప్రేమ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు తెలిపారు. తన తల్లి అతనితో ప్రేమ వద్దని ఎంత చెప్పినా ఆ బాలిక వినలేదు. దీంతో ఆ తల్లికి కోపం వచ్చింది. ఆ బాలిక అందుకు నిరాకరించడంతో తల్లి ఆమెను హత్య చేసి యువకుడిని ట్రాప్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో అక్టోబరు 2వ తేదీ రాత్రి తన కోడలు మీరాతో కలిసి గొడ్డలి, కర్రతో కూతురిని హతమార్చింది. అనంతరం కూతురి మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి బావిలో పడేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో