Hyderabad: అమీన్ పూర్ పిల్లల హత్య కేసులో తల్లి అరెస్టు..
- అమీన్ పూర్ పిల్లల హత్య కేసులో తల్లి అరెస్టు
- ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు
- తల్లి రజితతో పాటు ప్రియుడు శివను అరెస్టు చేసి రిమాండ్ కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమీన్ పూర్ లో తల్లి తన కడుపున పుట్టిన పిల్లలకు విషమిచ్చి కడతేర్చిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అమ్మతనానికి మాయని మచ్చగా రజిత అనే మహిళ ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను మృత్యుఒడికి చేర్చింది. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రజితను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి రజితతో పాటు ప్రియుడు శివను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
Also Read:PMO Office: డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై PMO ఉన్నత స్థాయి సమావేశం
Also Read
- Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
ఇటీవల జరిగిన గెట్ టు గెదర్ పార్టీలో శివ అనే వ్యక్తితో రజితకు పరిచయం ఏర్పడింది. పదో తరగతి వరకు శివతో కలిసి రజిత చదువుకుంది. ఆ పరిచయం కాస్త అక్రమసంబంధానికి దారితీసింది. గత కొన్ని నెలల నుంచి శివతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది రజిత. ఈ క్రమంలో శివతో కలిసి బతకాలని రజిత ప్లాన్ చేసింది.. పెళ్లి అయి ముగ్గురు పిల్లలు ఉన్నందున తనతో ఉండేందుకు ప్రియుడు శివ నిరాకరించాడు. పిల్లల్ని చంపి వస్తే తనతో జీవించేందుకు అవకాశం ఇస్తానని శివ చెప్పాడు. పిల్లలకు పెరుగులో విషం కలిపి చంపేయాలని రజితకు సలహా ఇచ్చాడు.
Also Read:CM Chandrababu: కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక చర్చలు..
పిల్లలు చచ్చిపోతే భర్త చెన్నయ్యను పోలీసులు అరెస్టు చేస్తారని ఐడియా ఇచ్చాడు. ప్రియుడు శివ ఇచ్చిన ఐడియాతోనే ముగ్గురు పిల్లల్ని చంపి కడుపు నొప్పి నాటకం ఆడింది తల్లి రజిత. పిల్లలు ముగ్గురు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8) కూడా విగతజీవులై పడిపోయారు. భార్య రజిత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ, విచారణలో రజిత అసలు బాగోతం వెలుగుచూసింది.
తాజావార్తలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?