Bangladesh: హిందూవులే లక్ష్యంగా దాడులు..భారత్ కు కోటి మందికి పైగా హిందువులు!
- బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం
- గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా నిరసనలు
- ఈ నిరసనల్లో వందలాది మంది మృతి
- గద్దెదిగిన హసీనా సర్కారు
- హిందువులను టార్గెట్ చేసి ఓ వర్గీయులు
- దేవాలయాలు..ఇళ్లపై దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది. ప్రస్తుతం ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఓ వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు. హిందువుల ఇళ్లకు నిప్పుపెట్టడం, వారిని చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతోంది. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు. ఆయన ఇంటికి ఏకంగా నిప్పుపెట్టినట్లు వార్తలు వచ్చాయి.
READ MORE: Gold Rate Today: వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇది కదా కావాల్సింది!
Also Read
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ఇది ఆనంద్ ఇంటికే పరిమితం కాదు. ఇస్కాన్తో సహా అనేక దేవాలయాలకు సంబంధించినది. దీంతో స్పందించిన బీజేపీ ప్రభుత్వం కోటి మందికి పైగా హిందూ శరణార్థులు భారతదేశానికి రాబోతున్నారని పేర్కొంది. బంగ్లాదేశ్లోని పెద్ద ఆంగ్ల వార్తా వెబ్సైట్ ది డైలీ స్టార్లో బుధవారం.. ‘హిందువుల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపారాలపై దాడులు కొనసాగుతున్నాయి’ అనే శీర్షికతో ఒక వార్త ప్రచురించింది. అంటే హిందూ గృహాలు, సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 6 మంగళవారం.. మరొక నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్లోని 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార స్థలాలు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది.
READ MORE:CM Pinarayi Vijayan: వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!
ఇస్కాన్కు నిప్పు..
బంగ్లాదేశ్ ఖుల్నా డివిజన్లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న దాడులపై ఇస్కాన్ అధ్యక్షుడు చిన్మోయ్ కృష్ణన్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ, ‘చిట్టగాంగ్లోని మూడు దేవాలయాలు ముప్పు పొంచి ఉన్నాయి. అయితే హిందూ సమాజంతో పాటు ముస్లిం సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు వాటిని సురక్షితంగా ఉంచారు.’ అని పేర్కొన్నారు. సోమవారం, షరియత్పూర్లోని ధనుకా మాన్సా బారి ఆలయంలో ఒక గుంపు రక్కసి సృష్టించింది. రాధా-కృష్ణుల విగ్రహంతో సహా మొత్తం ఆలయాన్ని కూల్చివేసింది.
READ MORE:Tollywood : రెండు రోజుల ముందుగానే స్పెషల్ షోలు.. ఏ సినిమా అంటే..?
ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోబిందో చక్రవర్తి మాట్లాడుతూ .. ఆలయంపై దాడి తరువాత, వారు మా ఇళ్లను చుట్టుముట్టారు. దాడి చేసేందుకు యత్నించగా.. సైన్యం రక్షించిందని చెప్పారు. అదే రోజు.. దినాజ్పూర్ శ్మశాన వాటికను ధ్వంసం చేశారు. పార్వతీపూర్ ఉపజిల్లాలో కాళీ దేవాలయంతో సహా ఐదు దేవాలయాలపై దాడి జరిగింది. చిరిర్బందర్ ఉపజిల్లాలో హిందూ కుటుంబాల ఇళ్లపై దాడి జరిగింది. హరిశోభ కోసం ఏర్పాటు చేసిన స్థలం కూడా ధ్వంసం చేయబడింది. బోచాగంజ్లో అనేక హిందూ కుటుంబాలపై దహన ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రకారం.. బారిషాల్ నగరంలోని హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దుండగులు పదునైన ఆయుధాలతో సంచరిస్తున్నట్లు కనిపించింది. కాట్పట్టి, చౌక్బజార్, బజార్ రోడ్ ఏరియాల్లో వారు సంచరిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో హిందువులే ఎక్కువగా నివసిస్తుంటారు.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!