Bangladesh: హిందూవులే లక్ష్యంగా దాడులు..భారత్ కు కోటి మందికి పైగా హిందువులు!
- బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం
- గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా నిరసనలు
- ఈ నిరసనల్లో వందలాది మంది మృతి
- గద్దెదిగిన హసీనా సర్కారు
- హిందువులను టార్గెట్ చేసి ఓ వర్గీయులు
- దేవాలయాలు..ఇళ్లపై దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది. ప్రస్తుతం ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఓ వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు. హిందువుల ఇళ్లకు నిప్పుపెట్టడం, వారిని చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతోంది. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు. ఆయన ఇంటికి ఏకంగా నిప్పుపెట్టినట్లు వార్తలు వచ్చాయి.
READ MORE: Gold Rate Today: వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇది కదా కావాల్సింది!
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
ఇది ఆనంద్ ఇంటికే పరిమితం కాదు. ఇస్కాన్తో సహా అనేక దేవాలయాలకు సంబంధించినది. దీంతో స్పందించిన బీజేపీ ప్రభుత్వం కోటి మందికి పైగా హిందూ శరణార్థులు భారతదేశానికి రాబోతున్నారని పేర్కొంది. బంగ్లాదేశ్లోని పెద్ద ఆంగ్ల వార్తా వెబ్సైట్ ది డైలీ స్టార్లో బుధవారం.. ‘హిందువుల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపారాలపై దాడులు కొనసాగుతున్నాయి’ అనే శీర్షికతో ఒక వార్త ప్రచురించింది. అంటే హిందూ గృహాలు, సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 6 మంగళవారం.. మరొక నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్లోని 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార స్థలాలు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది.
READ MORE:CM Pinarayi Vijayan: వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!
ఇస్కాన్కు నిప్పు..
బంగ్లాదేశ్ ఖుల్నా డివిజన్లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న దాడులపై ఇస్కాన్ అధ్యక్షుడు చిన్మోయ్ కృష్ణన్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ, ‘చిట్టగాంగ్లోని మూడు దేవాలయాలు ముప్పు పొంచి ఉన్నాయి. అయితే హిందూ సమాజంతో పాటు ముస్లిం సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు వాటిని సురక్షితంగా ఉంచారు.’ అని పేర్కొన్నారు. సోమవారం, షరియత్పూర్లోని ధనుకా మాన్సా బారి ఆలయంలో ఒక గుంపు రక్కసి సృష్టించింది. రాధా-కృష్ణుల విగ్రహంతో సహా మొత్తం ఆలయాన్ని కూల్చివేసింది.
READ MORE:Tollywood : రెండు రోజుల ముందుగానే స్పెషల్ షోలు.. ఏ సినిమా అంటే..?
ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోబిందో చక్రవర్తి మాట్లాడుతూ .. ఆలయంపై దాడి తరువాత, వారు మా ఇళ్లను చుట్టుముట్టారు. దాడి చేసేందుకు యత్నించగా.. సైన్యం రక్షించిందని చెప్పారు. అదే రోజు.. దినాజ్పూర్ శ్మశాన వాటికను ధ్వంసం చేశారు. పార్వతీపూర్ ఉపజిల్లాలో కాళీ దేవాలయంతో సహా ఐదు దేవాలయాలపై దాడి జరిగింది. చిరిర్బందర్ ఉపజిల్లాలో హిందూ కుటుంబాల ఇళ్లపై దాడి జరిగింది. హరిశోభ కోసం ఏర్పాటు చేసిన స్థలం కూడా ధ్వంసం చేయబడింది. బోచాగంజ్లో అనేక హిందూ కుటుంబాలపై దహన ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రకారం.. బారిషాల్ నగరంలోని హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దుండగులు పదునైన ఆయుధాలతో సంచరిస్తున్నట్లు కనిపించింది. కాట్పట్టి, చౌక్బజార్, బజార్ రోడ్ ఏరియాల్లో వారు సంచరిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో హిందువులే ఎక్కువగా నివసిస్తుంటారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..