Monsoon Session 2023: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు… నేడు అఖిలపక్ష సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Session 2023: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాల సహకారాన్ని కోరనుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. అయితే పలు పార్టీల నాయకులు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది.
Read Also:Bengaluru: బెంగళూరులో పేలుడుకు ప్లాన్.. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
Also Read
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
మంగళవారం బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుండగా, దేశ రాజధానిలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సమావేశమైంది. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్తో సహా కేబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బుధవారం జరిగే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి వ్యూహం రచించినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలకు ముందు, అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి, వివిధ పార్టీలు తమ సమస్యలను చెప్పుకునే సంప్రదాయం ఉంది.
Read Also:Godavari Flood: గోదావరికి పెరుగుతున్న వరద.. 25.4 అడుగులకు చేరిన ప్రవాహం
ఈ సమావేశంలో ప్రభుత్వ సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలాంటి అనేక సభల్లో పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు సభ కొనసాగనుంది. ఈ కాలంలో పార్లమెంటు ఉభయ సభల మొత్తం 17 సమావేశాలు ప్రతిపాదించబడ్డాయి. సెషన్ వాడీవేడిగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవైపు అధికార పక్షం ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలపడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు మణిపూర్ హింస, రైలు భద్రత, ధరల పెరుగుదల, అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు డిమాండ్ వంటి ఇతర అంశాలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుంది. .
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!