Moinabad: ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moinabad farmhouse drugs party: మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం పార్టీతో పాటు డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కాల్పులు జరగడం కూడా పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. పోలీసులు ఫామ్హౌస్లోకి ప్రవేశించిన సమయంలో ముందుగా బుల్లెట్ శబ్దం వినిపించిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై “మేము పోలీసులు.. కాల్పులు చేయవద్దు” అని గట్టిగా హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల తర్వాత కూడా మరో రెండు సార్లు కాల్పుల శబ్దం వినిపించిందని తెలిపారు.
Raashii Khanna: పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశా
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
ఆ సమయంలో “మీరు కాల్చేయండి.. ఏం జరిగినా బాధ్యత నాదే” అని ఒకరు గట్టిగా చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు గట్టిగా అరిచిన వెంటనే కాల్పులు ఆగిపోయినట్లు వెల్లడించారు. పోలీసులు ఫామ్హౌస్లో సెర్చ్ వారెంట్తో తనిఖీలు నిర్వహించారు. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ షెల్స్ పట్టుకుని ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. జర్మన్ తయారీ పాయింట్ 0.32 రివాల్వర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొదట విచారణలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా, పదేపదే ప్రశ్నించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. అతని వద్ద రెండు గ్రాముల కొకైన్ కూడా లభించింది. కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని మొదట ఎవరూ వెల్లడించలేదు. తరువాత పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ను విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో కౌశిక్ రవి కొకైన్ తానే తెచ్చినట్లు ఒప్పుకున్నాడు. సిమ్లాకు బిజినెస్ ట్రిప్కు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేశానని తెలిపాడు. డ్రగ్స్ పార్టీ కోసం కొకైన్ తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఒక్క గ్రాము కొకైన్ను సుమారు 15 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
పార్టీలో ఉన్న 11 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా పలువురికి పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుత్త మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఎర్రగడ్డ ఆసుపత్రిలో రెండోసారి నిర్వహించిన రక్త పరీక్షల్లో కూడా ఇదే విషయం బయటపడింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. పోలీసులు ఫామ్హౌస్లోకి రావడంతో భయపడిపోయి వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ తెలిపినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విచారణలో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి ముందుగానే వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇచ్చినట్లు తేలింది. అతని ఆహ్వానం మేరకు పలువురు ఫామ్హౌస్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, డ్రగ్స్ సరఫరా నెట్వర్క్పై కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!