Mohsin Naqvi: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కు కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్
- ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్ష్యుడి మార్పు.
- కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిర్వహణను పర్యవేక్షించే ప్రధాన సంస్థ. 1909లో స్థాపితమైన ఈ సంస్థ వివిధ దేశాల క్రికెట్ బోర్డులను సమన్వయం చేస్తూ, క్రికెట్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తోంది. ప్రపంచకప్, టి20 వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రముఖ టోర్నమెంట్ల నిర్వహణ బాధ్యతను ఈ సంస్థ చేపడుతుంది. ఐసీసీ పరిధిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కీలకంగా వ్యవహరిస్తుంది. ACC ఆసియా ఖండంలో క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైంది.
Read Also: Earthquake: నేపాల్లో 5 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
Also Read
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వెంటనే ACC బాధ్యతలు స్వీకరించిన నఖ్వీ, తన అధ్యక్ష పదవి పై స్పందించారు. ఇందులో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా వ్యవహరించడం నా గౌరవంగా భావిస్తున్నానని.. క్రికెట్ అభివృద్ధి కోసం సభ్య బోర్డులతో కలిసి పనిచేసే లక్ష్యంతో ఉన్నానని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2024లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మొహ్సిన్ నఖ్వీ, ఇప్పుడు ACCకి అధ్యక్షుడిగా రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న షమ్మీ సిల్వా స్థానాన్ని నఖ్వీ భర్తీ చేయనున్నారు. ACC మరింత బలోపేతం కావడానికి సభ్య దేశాల సమిష్టి కృషి అవసరమని నఖ్వీ స్పష్టం చేశారు. పాత అధ్యక్షుడు షమ్మీ సిల్వాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. జై షా నాయకత్వంలో ACC అనేక కీలక మైలురాళ్లను చేరుకుంది. ముఖ్యంగా ఆసియా కప్ వాణిజ్య హక్కులను అత్యధిక ధరకు విక్రయించడం, క్రికెట్ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారని నఖ్వీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!