Modugula Venugopala Reddy: 2029 ఎన్నికలలో మొట్టమొదట గెలిచేది దేవినేని అవినాషే!
- రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో మోదుగుల
- 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాష్
- జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీని ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడని జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ ప్రశంసించారు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాషే అని పేర్కొన్నారు. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు, పార్టీకి కొండంత అండ అని చెప్పారు. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసిందని మోదుగుల అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూ కోడ్ ద్వారా డాక్యుమెంటరీని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ విడుదల చేశారు.
Also Read: Alluri Sitarama Raju: బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి!
Also Read
- FIFA World Cup 2026: 'ఉండావ్' డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్లోకి అడుగు.!
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- IND W vs SA W: టీ20 ప్రపంచకప్లో భారత్కు కీలక పోరు.. దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి.!
‘వైసీపీని జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాష్. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు పార్టీకి కొండంత అండ. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసింది. చంద్రబాబు గెలిచాడు కానీ.. అతన్ని గెలిపించి ప్రజలు ఓడిపోయారు. విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే విధంగా కృషి చేస్తాం. రేపు అధికారంలోకి వస్తామో రామో అనే విధంగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు చేసిన తప్పుడు వాగ్దానాలు వివరించాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మమ్ములను ఇంత మోసం చేస్తున్నారా? అని ప్రజలు తెలుసుకోవాలి. మేము ఎక్కడ తిరుగుతున్నా కూటమి నేతలని తిడుతున్నారు. ‘బాబు షూరిటీ మోసం గ్యారంటీ’ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తే కూటమి నేతలు రోడ్లు మీద కూడా తిరగరు’ అని మోదుగుల అన్నారు.
తాజావార్తలు
-
Yoga Day Questions: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇది మీకోసమే!
-
FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్లోకి అడుగు.!
-
International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
-
CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
-
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!