Bihar Elections: బీహార్ రాజకీయాలను మలుపు తిప్పిన రో-కో జోడీ వీళ్లది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections: మన దేశంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రంగాలు ఏంటో తెలుసా.. క్రీడలు, సినిమా, రాజకీయాలు. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే క్రికెట్లో రోహిత్ – కోహ్లీ జంట తెలియని వారంటూ ఉండరు. వీళ్లు మైదానంలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు విజయం చాలా దూరంలో ఉన్నట్లే అని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి జోడీనే బీహార్ ఎన్నికల్లో మ్యాజిక్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జోడీ ఎవరిదో తెలుసా.. బీహార్ సీఎం నితీష్ కుమార్- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. బీహార్ పొలిటికల్ పిచ్పై ఈ ఇద్దరూ రాజకీయ క్రీడాకారులు నిర్మించిన అద్భుతమైన ఇన్సింగ్స్ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఎవరూ ఊహించని ఫలితాలను సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎన్డీఏకు 200 కంటే ఎక్కువ సీట్ల ఆధిక్యం వైపుగా దూసుకుపోతుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో మహా కూటమి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు వరకు తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో ఏమైనా అద్భుతాలను సృష్టించగలరా అనే విషయంపై రకరకాల చర్చలు జరిగాయి కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ – జేడీయూ అనుసరించిన ఎన్నికల వ్యూహం అద్భుతాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ – నితీష్ ప్రశాంతమైన ప్రవర్తనతో, పూర్తి నియంత్రణతో ఈ ఎన్నికల సమరంలో టీమిండియాకు క్రికెట్లో పెట్టని కోట లాంటి రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీలా మారి వారివారి పార్టీలకు విజయాన్ని అందించారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
రోహిత్-విరాట్లతో పోలిక ఎందుకంటే..
బీహార్ ఎన్నికలకు రోహిత్ – విరాట్లకు పోలిక ఎందుకంటే.. ఇటీవల క్రికెట్లో ఏం జరిగిందో బీహార్ రాజకీయాల్లో అదే పునరావృతమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చాలా మంది విమర్శించడం మొదలు పెట్టారు. ఇక ఈ ఇద్దరి కెరీర్ చివరి దశలో ఉందని కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కానీ వాళ్లిద్దరూ తమలో ఇంకా ఆటతీరు తగ్గలేదని ఆస్ట్రేలియాలో చూపించాడు. అచ్చం అలాగే నరేంద్ర మోడీ – నితీష్ కుమార్లను ఇద్దరినీ కూడా ఎన్నికల ముందు తక్కువ అంచనా వేశారు. కానీ ఎన్నికల పిచ్లో వారు ప్రతి బంతిని చదివి తమకు పూర్తి అనుకూలమైన షాట్లను విజయవంతం బౌండరీ లైన్లను దాటించి, ఈ ఎన్నికల్లో మరపురాని విజయాన్ని అందుకున్నారు.
స్పష్టంగా మారిన చిత్రం..
వాస్తవానికి నవంబర్ 14న ఉదయం అంతా బీహార్ ఎన్నికల ట్రెండ్ అప్డేట్లు ఉత్కంఠను కొనసాగించాయి. కానీ మధ్యాహ్నం నాటికి వాటి చిత్రం మరింత స్పష్టంగా మారింది. NDA రికార్డు స్థాయిలో ఆధిక్యాన్ని పొందుతోంది. BJP కి ఈ విజయం కేవలం సీట్ల గురించి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఆ పార్టీ పట్టును సూచిస్తున్నాయి, అలాగే JDU సంస్థాగత, సూక్ష్మ నిర్వహణ శక్తిని నిరూపించాయి. వాస్తవానికి గొప్ప రోడ్ షోలతో మహా ఘట్బంధన్ ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే NDA వ్యూహం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. సూక్ష్మ స్థాయిలో NDA తన పని పూర్తి చేసింది, అలాగే ఈ కూటమికి బూత్ నిర్వహణ బలంగా ఉంది. ఈ కూటమి విజయానికి మహిళా ఓటర్లపై పెట్టిన ప్రత్యేక దృష్టి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కేంద్ర – రాష్ట్ర పథకాల ప్రభావం ప్రతి గ్రామంలోనూ కనిపించింది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి EBC, OBC, SC, ST వర్గాలలో గణనీయమైన ఓట్లు కలిసి వచ్చాయి. అలాగే JDU పార్టీకి మహిళల ఓట్లు అధికారాన్ని నిలబెట్టడానికి సహాయం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. నరేంద్ర మోడీ తన ప్రసంగాలలో మహిళల ఓటును నిరంతరం కేంద్రీకరించారు. రాష్ట్రంలో మహాఘట్బంధన్ ఓటమికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో గాలి తమకు అనుకూలంగా ఉందని భావించి క్షేత్రస్థాయిలో పార్టీ వర్గాలను బలోపేతం చేయడంలో విఫలమయ్యాయి అని చెబుతున్నారు. బీహార్ రాష్ట్ర రాజకీయ దృశ్యానికి PK నమూనా సరిపోలలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తేజస్వి యాదవ్ కూడా యువత నుంచి విస్తృత మద్దతు లభిస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ ఈసారి రాష్ట్రంలో యువ ఓటర్ల తీర్పు వారికి పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో మోడీ- నితీష్ కూటమికి విజయం వరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: IND vs SA Test: ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే?
తాజావార్తలు
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!