Kishan Reddy: ‘ముద్ర యోజన’ ద్వారా దేశ ఔత్సాహిక యువతను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా బ్యాంకుల సహాయంతో లోన్స్ పొంది.. పెద్ద ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎదుగుతున్న వారు వారి వారి అనుభవాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా మహిళ పారిశ్రామిక వేత్తలు బ్యాంక్ల ద్వారా తమకు అందుతున్న సహాయాన్ని తెలిపారు. ఈ సమావేశం బంజారాహిల్స్ రోడ్ నెం.1 బంజారా ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
Read Also: Maamannan Collections: బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతున్న ”మామన్నన్”
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా బ్యాంక్ ల సహాయంతో ఎదుగుతున్న యువ పారిశ్రామిక వేత్తలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎంచుకున్న రంగంలో మీ అనుభవాల్ని పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మీ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మోదీ సూచించారని ఆయన పేర్కొన్నారు. మీ అనుభవాలను పరిగణలోకి కొత్త పథకాలను యువతకు అందించొచ్చు అనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని తెలిపారు. దేశ యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి, ఉద్యోగా అవకాశాలు కల్పించారని కిషన్ రెడ్డి సూచించారు. అందులో భాగంగానే ‘ముద్ర యోజన’ ద్వారా దేశ ఔత్సాహిక యువతను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Disha Patani: బాబోయ్.. ఇంత హాట్ అయితే తట్టుకోవడం కష్టమే..
మరోవైపు ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ద్వారా అనేక మంది యువత రుణాలు పొంది.. వారి వారి రంగాలలో దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో.. సుమారుగా 19లక్షల కోట్ల రూపాయల వరకు ముద్ర రుణాల ద్వారా దేశ యువత సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించుకునేందుకు దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రవేశ పెట్టిన పథకాలు.. ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉదేశ్యంతో ఇటువంటి కార్యక్రమలు ఉపయోగపడతున్నామని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో