గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇద్దరు ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్గా రాజకీయ పార్టీలను ఆయన ఏకతాటిపైకి తీసుకు వచ్చారు.
Read Also: CM Revanth Reddy: నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రివ్యూ..
ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. కానీ వారికి అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లను పంపించింది.