Talasila Raghuram: లోకేష్ ది అనామక పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. టీడీపీ నేత త్వరలో పాదయాత్రకు రెడీ అయ్యారు. లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం లోకేష్ పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని విమర్శించారు. పనికిమాలిన యాత్రలతో అబద్ధాలు చెప్పబోతున్నారు. అప్పట్లో వైసీపీకి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పాదయాత్ర చెయ్యాలని చెప్పారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.
జగన్ పాదయాత్ర రాత్రి సమయంలో జరగలేదు. ఇదేం ఖర్మ పేరుతో చేపట్టిన యాత్రలు ఏమయ్యాయి? అమరావతి నుంచి అరసవల్లి యాత్ర ఎక్కడుంది? ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కూడా అంతే అని తలశిల రఘురాం దుయ్యబట్టారు. లోకేష్ యాత్రతో ఒరిగేదేం ఉండదన్నారు. ఆ పాదయాత్రకు ఎవరూ భయపడడం లేదని ఇంతకుముందే ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన పాదయాత్రకు, అనామకుడు లోకేష్ చేసే యాత్రకు చాలా తేడా ఉంది. వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తికి నమస్కారం చేసి యాత్ర ప్రారంభించటం ఏంటి? జగన్ పాదయాత్ర చీకటి ముగిసేసరికి ముగిసేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Read Also: Shubman Gill: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప..గిల్ తెలివైన సమాధానం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. కానీ లోకేష్ మొదటి అడుగు పడకముందే కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం పాదయాత్ర చేస్తే మంచిది. అమరావతి రైతుల పేరుతో చేసిన యాత్ర కూడా మధ్యలోనే ఆగిపోయింది. నిజమైన లక్ష్యంతో యాత్రలు చేస్తేనే సక్సెస్ అవుతాయి. ప్రగల్భాల మాటలను టీడీపీ లీడర్లు మానుకోవాలి.. ఇన్ని మాటలు మాట్లాడేవారు అప్పుడు ఏం చేశారు? అరసవిల్లి వెళ్లకుండా ఇంట్లో ఎందుకు పడుకున్నారు?సెక్యూరిటీ సమస్యలు రాకూడదనే మేము వివరాలు అడుగుతున్నాం అన్నారు.
శాంతియుతంగా పాదయాత్ర చేస్తే అందరూ హర్షిస్తారు. జగన్ ని సైకో అని విమర్శిస్తే ప్రజలు కొడతారు.. జగన్ పాదయాత్ర సమయంలో కూడా ముందు కడప జిల్లా వరకే అనుమతులు ఇచ్చారు..సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే యాత్రలు చేయాలన్నారు. 2019 నుండి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలు వివరిస్తాం. వాటికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు రఘురాం. లోకేష్, పవన్ కళ్యాణ్ తోపాటు ఇంకెవరైనా ఉంటే వారితో కూడా పాదయాత్ర చేయించుకోవచ్చు. అనామకుడు చేసే యాత్రలకు హైప్ క్రియేట్ చేయాల్సిన పనిలేదన్నారు.
Read Also: Ukraine Crisis: నాటోలో తొలగిన విభేదాలు.. ఉక్రెయిన్ చేతికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!