MLC Kavitha: నా కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నాది ఆస్తుల పంచాయితీ కాదు!
- కుటుంబ గొడవలపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
- నాది ఆస్తుల పంచాయితీ కాదు
- నైతికతలేని పార్టీలో ఉండదల్చుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు.
‘ఇసుక అక్రమ రవాణా వల్ల నెరేళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేను ఒక్కదాన్నే కేసీఆర్ను ప్రశ్నించే దాన్ని. కేసీఆర్ నాకు వ్యక్తిగతంగా తండ్రి. టీఆర్ఎస్ పేరు మార్పును నేను ఒప్పుకోలేదు, ఆ మీటింగ్కు నేను హాజరుకాలేదు. తెలంగాణలో ఏం చేశారని దేశ రాజకీయాలు?. రాష్ట్రంలో యువకులు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కేసీఆర్ మీద కక్ష్యతో బీజేపీ నన్ను జైలుకు పంపింది. ఇంత జరిగినా నాకు పార్టీ, నాయకులు మద్దతుగా నిలువ లేదు. కాళేశ్వరం మీద గోష్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నింద వేసింది. కేసీఆర్ను విమర్శిస్తే.. నేను తప్ప ఏ ఒక్కరు మాట్లాడలేదు. అవినీతి పరులైన హరీష్ రావు, ఆయన అనుచరుల పేర్లు బయట పెట్టా. జాతీయ స్థాయిలో పని చేయాలని బీఆర్ఎస్ అనుకోవడం ఒక జోక్. బీఆర్ఎస్ చీలికలను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావించింది’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
Also Read
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
- Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
Also Read: MLC Kavitha: నాపై కక్ష కట్టారు.. శాసనమండలిలో కవిత కంటతడి!
‘నాది ఆస్తుల పంచాయతీ అని ప్రచారం చేస్తున్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. అసెంబ్లీ, మండలిలో మహిళలకు సరైన గౌరవం లేదు. అజిత్ సింగ్, శిబు సొరేన్లను రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక శాలువా కప్పి ఎందుకు గౌరవం ఇవ్వలేదు. నైతికత లేని బీఆర్ఎస్ పార్టీలో ఉండలేనని రాజీనామా చేశా. తెలంగాణ బాగుండాలనేది నా లక్ష్యం. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. నేను న్యాయం వైపు ఉన్నా.. నేను ఏ తప్పు చేయలేదు. వ్యక్తిగా ఈ సభ నుంచి వెళ్తున్నా.. మళ్ళీ ఓ శక్తిగా ఈ సభకు తిరిగి తప్పకుండా వస్తా’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!