MLC Kavitha: నా కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నాది ఆస్తుల పంచాయితీ కాదు!
- కుటుంబ గొడవలపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
- నాది ఆస్తుల పంచాయితీ కాదు
- నైతికతలేని పార్టీలో ఉండదల్చుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు.
‘ఇసుక అక్రమ రవాణా వల్ల నెరేళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేను ఒక్కదాన్నే కేసీఆర్ను ప్రశ్నించే దాన్ని. కేసీఆర్ నాకు వ్యక్తిగతంగా తండ్రి. టీఆర్ఎస్ పేరు మార్పును నేను ఒప్పుకోలేదు, ఆ మీటింగ్కు నేను హాజరుకాలేదు. తెలంగాణలో ఏం చేశారని దేశ రాజకీయాలు?. రాష్ట్రంలో యువకులు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కేసీఆర్ మీద కక్ష్యతో బీజేపీ నన్ను జైలుకు పంపింది. ఇంత జరిగినా నాకు పార్టీ, నాయకులు మద్దతుగా నిలువ లేదు. కాళేశ్వరం మీద గోష్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నింద వేసింది. కేసీఆర్ను విమర్శిస్తే.. నేను తప్ప ఏ ఒక్కరు మాట్లాడలేదు. అవినీతి పరులైన హరీష్ రావు, ఆయన అనుచరుల పేర్లు బయట పెట్టా. జాతీయ స్థాయిలో పని చేయాలని బీఆర్ఎస్ అనుకోవడం ఒక జోక్. బీఆర్ఎస్ చీలికలను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావించింది’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Also Read: MLC Kavitha: నాపై కక్ష కట్టారు.. శాసనమండలిలో కవిత కంటతడి!
‘నాది ఆస్తుల పంచాయతీ అని ప్రచారం చేస్తున్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. అసెంబ్లీ, మండలిలో మహిళలకు సరైన గౌరవం లేదు. అజిత్ సింగ్, శిబు సొరేన్లను రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక శాలువా కప్పి ఎందుకు గౌరవం ఇవ్వలేదు. నైతికత లేని బీఆర్ఎస్ పార్టీలో ఉండలేనని రాజీనామా చేశా. తెలంగాణ బాగుండాలనేది నా లక్ష్యం. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. నేను న్యాయం వైపు ఉన్నా.. నేను ఏ తప్పు చేయలేదు. వ్యక్తిగా ఈ సభ నుంచి వెళ్తున్నా.. మళ్ళీ ఓ శక్తిగా ఈ సభకు తిరిగి తప్పకుండా వస్తా’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!