MLA Rekha Nayak : ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 95-105 సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Bandi Sanjay : గజ్వేల్లో ఓడిపోతననే కేసీఆర్ కామారెడ్డికి పోతుండు
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
అయితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ 95-105 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేసీఆర్ విలేకరుల సమావేశంలో అన్నారు. అంతేకాకుండా.. ఎంఐఎం, హైదరాబాద్ లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో బీఆర్ఎస్ స్నేహం కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటన చేస్తూనే చెప్పారు. అయితే.. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, మెట్పల్లి ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. కాగా, గోషామహల్, నాంపల్లి, జనగాం, నర్సాపూర్ నాలుగు నియోజకవర్గాలకు అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు.
Also Read : Pakisthan: పాకిస్థాన్ లో కొద్దీ ఇళ్లకు, చర్చిలకు నిప్పు..
అయితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో జాన్సన్కు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందిస్తూ.. ఇంకా 50 రోజుల వరకూ నేను ఎమ్మెల్యేగా ఉంటానన్నారు. మిగిలిన పనులు చేస్తానని, ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇంకా వేరే ఆలోచించ లేదని, లాస్ట్ ఊపిరి వరకు ఖానాపూర్ లో ఉంటానని ఆమె వెల్లడించారు. ఖానాపూర్ ప్రజలే నా అమ్మానాన్న అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే ఆలోచన చేయలేదని, నా జీవితం ప్రజలకు అంకితమన్న రేఖానాయక్.. చావైనా బతుకైనా ఇక్కడే అని వ్యాఖ్యానించారు.
అయితే.. రేఖా నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీచేసి విజయం సాధించింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారిటీతో విజయం సాధించింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!