MLA Rammohan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, పార్టీ చిన్నాభిన్నమైన కూడా ఇంకా సిగ్గు రాట్లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెల్లెలు కవిత జైలుకు పోయి, కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్ బుర్ర పని చేయడం లేదన్నారు. తీవ్ర నిరాశ నిస్పృహలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్ లో బలుపు, అహంకారం తగ్గలేదని, నోటి దురుసు తగ్గించుకోకపోతే నాలుక చీరేస్తాం.. చీరి చింతకు కడతామన్నారు. ముఖ్యమంత్రి ని హౌలా అంటావా కేటీఆర్ ? నువ్వే పెద్ద హౌలా గాడివి. బట్టేబాజ్ గాడివి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. నీ హౌలా పనులు అందరికి తెలుసు.. నీ బతుకే ఒక హౌలా బ్రతుకు… అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అన్ని పీకి నిన్ను ,నీ అయ్యను ఇంటికి పంపించారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పార్లమెంటు ఎన్నికల్లో పీకడానికి కూడా ఏమీ లేదు నీ దగ్గర.. ఈ రాష్ట్రంలో ఎవరు జేబు దొంగనో అందరికి తెలుసు.. కల్వకుంట్ల కుటుంబం ప్రజల జేబులు కొట్టి దాచుకున్న వేల కోట్లు కక్కిస్తాం, దొంగలు కాబట్టే మీ చెల్లె తీహార్ జైల్లో ఉంది.. నువ్వు కూడా చంచల్ గూడ కుపోవడానికి సిద్ధంగా ఉండు.. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతుంది… ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయించడానికి సిగ్గుందా నీకు.. మీ బతుకులు త్వరలో బయటపడతాయి…. ఎవరు వసూలు రాజా నో త్వరలోనే తెలుస్తుంది.. ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి మీరు చేయించిన వసూళ్ల జాబితా వస్తుంది.. సిద్ధంగా ఉండు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను ఎవరు బెదిరించారో మీ ఎలక్షన్ బాండ్లు చూస్తే అందరికి అర్థమైపోతుంది.. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేదు… పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీలో విలీనం చేయడం ఖాయం.. ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది..
Also Read
ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా వాష్ అవుట్ అవుతుంది… ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలుసు.. మీ పార్టీ ఎంపీ అభ్యర్థులను చూస్తేనే వ్యవహారం అర్థమౌతోంది.. సిగ్గు లేకుండా నువ్వు నీ బావ హరీష్ రావు అప్పట్లో మా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా..? దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరితే ఎగిరెగిరి పడుతున్నావు.. తలసాని ఏ పార్టీలో గెలిచి నీ అయ్య క్యాబినెట్ లో మంత్రి అయ్యాడో మరిచిపోయావా..? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ లో గెలిచి ఎక్కడ మంత్రిగా పనిచేశారో గుర్తు లేదా..? 10 యేళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు..?’ అని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!