NTV Telugu Site icon

MLA Rajasingh: ఫేక్‌కాల్స్‌కు స్పందించొద్దు.. గోషామహల్ ప్రజలకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన

Mla Rajasingh

Mla Rajasingh

MLA Rajasingh: గోషామహల్ ప్రజలకు ఎమ్మె్ల్యే రాజా సింగ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్ రూం దరఖాస్తు దారులకు ఫేక్ కాల్స్ చేస్తూ.. అజ్ఞాత వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఫేక్ కాల్స్‌కు ప్రజలు ఎవరు స్పందించవద్దని సూచన చేశారు. ఆ ఫేక్‌కాల్స్‌ను నమ్మి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొద్దన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని.. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి అయితే కాదన్నారు. వారికి మన నంబర్స్ ఎలా వెళ్లాయనే విషయంపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read Also: TG Inter Supply Results: విడుదలైన ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు..