MLA Kethireddy Venkatarami Reddy: సీఎం కాన్వాయ్ను రైతులు అడ్డుకునే ప్రయత్నం పక్కా ప్లానే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kethireddy Venkatarami Reddy: సీఎం కాన్వాయ్ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని.. అప్పట్లో ఎకరాకు 5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు. రైతులకు ఐదు లక్షల కాదు 20 లక్షలు ఇవ్వాలని తాను పోరాడానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో కలసి అధికారులందరి దగ్గరికి వెళ్ళామని చెప్పారు. ఒక్కసారి కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత పరిహారం పెంచరు.. అది చట్టమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. రైతులకు ఐదు లక్షల పరిహారం టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందేనన్నారు. పరిహారం పెంచడం సాధ్యం కాదని అప్పుడే రైతులకు చెప్పానని.. కానీ ఇప్పుడు సీఎంని అడ్డుకునేలా కొందరు రెచ్చగొట్టి పంపించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు. రైతులు అడ్డుకుంటారని కొందరికి ముందే తెలుసని.. ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరగనివ్వనన్నారు.
Read Also: Ambati Rambabu: కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు కారణం చంద్రబాబే..
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి జగనన్న కాలనీ వద్ద బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ను కొందరు రైతులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో ధర్మవరం మీదుగా వెళ్తున్న విషయం తెలుసుకున్న బాధిత రైతులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. తుంపర్తి, మోటుమర్ల గ్రామాలకు చెందిన వీరు ఒక్కసారిగా రహదారి పైకి చేరుకొని.. తమకు పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ హఠాత్పరిణామంతో కాన్వాయ్లోని సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!